రష్మిక మందన ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. జూనియర్ సీనియర్ హీరోలు అన్న తేడా లేకుండా ప్రతి చిత్రాన్ని సైన్ చేస్తూ వరుస విజయాలతో భారీగా క్రేజ్ సంపాదించుకున్న కన్నడ బ్యూటీ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ రేసులో ముందంజలో ఉంది. టాలీవుడ్ 'గోల్డెన్ లెగ్' గా పేరు తెచ్చుకున్న రష్మిక లేటెస్ట్ గా నితిన్ సరసన నటించిన భీష్మ చిత్రంతో మరో సూపర్ హిట్ అందుకుంది. ఇప్పటికే మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన నటించిన ముద్దుగుమ్మ ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో అవకాశం దక్కించుకుందని సమాచారం.

 

అయితే రష్మిక ప్రేమాయణం విషయానికి వస్తే కన్నడ హీరో రక్షిత్ శెట్టితో  నిశ్చితార్థం ఫిక్స్ చేసుకున్న తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి వారి పెళ్లి కాస్తా పెటాకులు అయింది. అయినా విషయాలు ఏమీ పట్టించుకోకుండా రష్మిక మాత్రం తన సినిమాలతో బిజీగా ఉంది మరొక పక్క రేష్మిక లవర్ విషయంతో బాగా ఇబ్బంది పడి ఇప్పుడిప్పుడే మళ్లీ హీరోగా నిలదొక్కుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.

 

మధ్యనే అతను 'అతడే శ్రీమన్నారాయణ' అని ఒక పాన్ ఇండియా సినిమా చేసి దెబ్బతిన్నాడు. అందుకే తనని మంచి హీరోగా నిలబెట్టిన 'కిరిక్ పార్టీ' సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. చిత్రం షూటింగ్ లోనే రక్షిత్ మరియు రష్మిక మధ్య ప్రేమ చిగురించింది.

 

చిత్రానికి సీక్వెల్ కావడంతో కిరిక్ పార్టీ పార్టీ 2లో రష్మిక ను హీరోయిన్ గా తీసుకునేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయట. ఇప్పటికే చాలాసార్లు రక్షిత్ శెట్టి విషయంపైన రష్మిక ను ప్రశ్నించినప్పుడు మాట దాటేసిన ఆమె మళ్ళీ హీరోతో రొమాన్స్ చేయడానికి సిద్ధం కాబోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. మళ్లీ మాజీ ప్రియుడితో కలిసి నటించేందుకు రేష్మిక నిజంగా ఒప్పుకుంటుందా లేదా అన్న విషయం వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: