ఒక హీరో కోసం అనుకున్న కథ అక్కడ వర్కవుట్ కాకపోతే వెంటనే మరో హీరో దగ్గరికి వెళ్లడం ఇండస్ట్రీలో సర్వ సాధారణమైన విషయం. అలా చేతులు మారిన కథలు కొంత మందికి బ్లాక్ బస్టర్లని, మరి కొంత మందికి దారుణమైన ఫ్లాప్లని అందించాయి. ఇక అది వేరే విషయం. అది కథలో ఉండే దమ్ముని బట్టి దర్శకుడు ఆ కథని తెరకెక్కించేదాన్ని బట్టి ఉంటుంది. తాజాగా అలాంటి ఓ కథే మాస్ మహారాజాని వెతుక్కుంటూ వచ్చింది. `హలో గురూ ప్రేమ కోసమే` చిత్రం తరువాత త్రినాథరావు నక్కిన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సురేష్ ప్రొడక్షన్స్ని నమ్ముకున్నాడు. కానీ అక్కడ సురేష్ బాబు ఎటూ తేల్చక నాన్చుతుండటంతో త్రినాథరావు బయట ప్రయత్నాలు మొదలు పెట్టాడట.
వెంకీ హీరోగా పవర్ఫుల్ పోలీస్ స్టోరీని చేయాలని త్రినాథరావు నక్కిన ప్లాన్ చేసుకున్నాడు. కథ విన్న వెంకీ ఓకే అన్నా కూడా సురేష్ బాబు మాత్రం మార్పుల మీద మార్పులు చెబుతూనే వున్నాడట. దీంతో విసుగొచ్చిన త్రినాథరావు నక్కిన అదే కథని మాస్ రాజా రవితేజకు వినిపించాడట. క్యారెక్టర్ కొత్తగా వుండటం, పోలీస్ క్యారెక్టర్ కావడంతో రవితేజ్ గ్రీన్సిగ్నల్ ఇచ్చేశాడట. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా సంస్థ నిర్మించబోతోంది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం వుందని తెలిసింది.
గతంలో కూడా ఇలా సురేష్బాబు గురించి చాలా మంది అనుకుంటారు. ఆయనకు కథ అనేది ఒక పట్టాన నచ్చదని దర్శకుడు ఏ కథని తీసుకువెళ్ళిన అందులో మార్పులు చాలా ఎక్కువగా చెపుతారు అని చాలా మంది అంటారు. ఇప్పుడు ఆ కథ గనుక హిట్ అయితే రవితేజ మళ్ళీ ఫామ్లోకి వచ్చేస్తాడు. ఇక వెంకీ మిస్ అయినందుకు ఫీలవ్వవలసి ఉంటుంది. అయినా గతంలో వెంకటేష్ పోలీస్ క్యారెక్టర్లు చాలా చేశారు. ఆ పాత్రకు కరెక్ట్గా సూట్ అవుతారు మరి సురేష్బాబు ప్రాబ్లమ్ ఏంటో ఇంతకీ అర్ధం కాలేదు. ఏదనా సరే అతిగా చేస్తే నోటి వరకు వచ్చింది అనవసరం వదులుకోవలసి వస్తది అని కొందరు అననే అంటారు.