మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ణి నితిన్ ఎక్కువగా ఇష్టపడతారు. ఇష్టం అంటే అలా ఇలా కాదు పవన్ కి ఆయన వీర భక్తుడు. పవన్ని తన సినిమా నటనలో  అనుకరిస్తాడు కూడా. పవన్ జనసేనకు పూర్తి మద్దతు ఇస్తూ పాతిక లక్షలు పార్టీ ఫండ్ గా ఇచ్చి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది కూడా నితినే. ఇక నితిన్ సినిమాలు బాగుండాలని పవర్ స్టార్ పవన్ కోరుకుంటారు. ఇలా మెగా కాంపౌండ్ తో నితిన్ బంధం పెద్దదే.

 

అయితే అదిపుడు మెల్లగా మరింతగా విస్తరిస్తోంది. నితిన్ లేటెస్ట్ హిట్ భీష్మని ఓ రేంజిలో పొగిడాడు అల్లు అర్జున్. నితిన్ కి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పాడు. అలా మెగా ఫ్యామ్నిలీలో స్టైలిష్ స్టార్ తో కూడా మరో బంధం పెనవేసుకున్న నితిన్ ఇంకో మెగా హీరోతో కూడా చెట్టాపట్టాల్ వేయబోతున్నాడుట.

 

ఆయనే నాగబాబు కుమారుడు మెగా ప్రిన్స్. అదే వరుణ్ తేజ్. భీష్మ సక్సెస్ అయిన సందర్భంగా విశాఖలో భారీ ఎత్తున విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. దానికి చీఫ్ గెస్ట్ గా వరుణ్ హాజరవుతున్నారుట. ఇలా ఈ ఇద్దరు హీరోలు ఒకే వేదిక మీద కనిపిస్తారు. నిజంగా ఇది అభిమానులకు కనువిందు కలిగించే విషయమే.

 

విశాఖలో ఇప్పటివరకూ సక్సెస్ మీట్లు. విజయోత్సవాల రికార్డు కూడా మెగా హీరోలకే ఉంది. ఇపుడు నితిన్ తొలిసారిగా విశాఖను ఎంచుకున్నారు. ఈ నెల 29న విశాఖ సిటీలో జరిగే ఈ ఫంక్షన్ లో టాలీవుడ్లో పెద్దలంతా హాజరవుతారని టాక్. అదే జరిగితే ఆంధ్ర సినీ రాజధానిగా  విశాఖ మరోమారు వెండి వెలుగులతో వెలిగిపోవడం ఖాయం.

 

ఇప్పటికే  సినీ పెద్దల కన్ను విశాఖ మీద పడిన క్రమంలో వరసగా విశాఖలో ఫంక్షన్లు జరుగుతున్నాయి.  మరి రాజధాని కూడా కాబోతున్న విశాఖకు ఇది మంచి బూస్టింగే.

మరింత సమాచారం తెలుసుకోండి: