దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద డాన్స్ రియాలిటీ షోగా గుర్తింపు పొందింది ప్రముఖ ఛానెల్లో ప్రసారం అవుతున్న `ఢీ`. ఇప్పటికే ఢీ ప్రోగ్రామ్ 11 సీజన్లు కంప్లీట్ చేసుకొని 12వ సీజన్లో అడుగుపెట్టింది. ప్రేక్షకులను అలరించడానికి ఎంటర్ టైన్ మెంట్ ని టన్నుల టన్నుల కొద్ది అందిస్తోంది ఈ షో. ఇక ఈ ప్రోగ్రామ్తో ఎంతో మంది డాన్సర్లు, డాన్స్ మాస్టర్స్ను చేసింది. తెలుగులో ‘ఢీ’ బెస్ట్ డాన్స్ షోగా గుర్తింపు పొందింది. ఢీ ద్వారా శేఖర్, గణేశ్, జానీ, రఘు, యశ్వంత్ ఇలా ఎంతో మంది కొరియోగ్రాఫర్లు తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అందుకే ఈ షో అంత పాపులర్ అయింది.
అయితే ఈ డాన్స్ షో లో కేవలం డాన్సే కాకుండా.. సుధీర్, రష్మీ గౌతమ్ రొమాంటిక్ కామెడీ మరియు ప్రదీప్ మాచిరాజు యాంకరింగ్ ఈ షోకు స్పెషల్ అస్సెట్గా నిలుస్తాయి. ప్రస్తుతం ఢీ చాంపియన్స్ పేరిట ప్రసారం అవుతున్న ఈ సీజన్లో.. గతంలో ఈ షో ద్వారా పాపులర్ అయిన డ్యాన్సర్స్, కొందరు ఛాంపియన్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంతో ఈ సీజన్ పోటీ పోటీగా జరుగుతోంది. అందుకే గతంలో ఉన్న ఫ్యాన్స్ కంటే ఈ సీజన్కు మరింత మంది అభిమానులు వచ్చి చేరుతున్నారు.
ఓ పక్క అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అలాగే మరోపక్క మైమరపించే డాన్స్ పెర్ఫామెన్స్ లతో ఈ సీజన్ కొనసాగుతుంది.ఈ రెండు అంశాలు సమపాళ్లలో ఉండే ఈషో ఇప్పుడు డాన్స్ ఎంటర్టైన్మెంట్ ను మరింత స్థాయిలో బీట్ చేస్తున్నట్టు లేటెస్ట్ ఢీ ప్రోమో చూస్తే అర్ధం అవుతుంది. మార్చ్ 4న ప్రసారం కాబోయే ఎపిసోడ్ తాలుక ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో జతిన్ మరియు సోములు చేసిన పెర్ఫామెన్స్ లు ఓ లెవెల్లో ఉంటే.. షోలో సుధీర్, రష్మీ ఆది, వర్షిణి మరియు ప్రదీప్ చేసిన కామెడీ మరో లెవెల్లో ఉంది.
అలాగే ఈ సూపర్ సర్ప్రైజింగ్ పెర్ఫామెన్స్ లతో పాటుగా టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు ఢీ సెట్స్ పైకి అడుగుపెట్టి మరో సర్ప్రైజ్ ఇచ్చారు. ఇక చివరిగా లాస్ట్ లో ప్రదీప్ మరియు పూర్ణలు చేసిన రెట్రో సాంగ్ మరింత హైలైట్ అయ్యింది. మొత్తంగా కామెడీ పరంగా, పెర్ఫామెన్స్ లు పరంగా, సర్ప్రైజ్ ల పరంగా ప్రోమోను అద్భుతంగా కట్ చేశారు. మరియు ఈ ప్రోమో చూస్తే ఖచ్చితంగా కడుపుబ్బా నవ్వాల్సిందే..!