ఇటీవల కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేని యంగ్ హీరో నితిన్, ఎట్టకేలకు కొద్దిరోజుల క్రితం వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన భీష్మ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించగా, యువ సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించడం జరిగింది. ఇక దాదాపుగా విడుదలైన అన్ని ప్రాంతాల్లో కూడా మంచి కలెక్షన్ రాబడుతూ దూసుకుపోతున్న ఈ సినిమా టీమ్ కు ఒక భారీ షాక్ ఇచ్చారు ఒక బస్ ట్రావెల్స్ వారు. 

 

నిన్నరాత్రి ఒక ప్రైవేట్ బస్సులో భీష్మ సినిమాని ఒక ట్రావెల్స్  సంస్థ వారు ప్రదర్శించడంతో ఒక్కసారిగా బస్సులోని ప్రయాణీకులు ఉలిక్కిపడ్డారు. సినిమా రిలీజ్ అయి కనీసం వారం కూడా కాకుండా సినిమాని ఈ విధంగా బస్సులో వేసేయడం నిజంగా అన్యాయం అని వారు భావించారట. ఇక వెంటనే అందులోని ఒక ప్రయాణీకుడు దానిని ఫోటో తీసి తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ దర్శకుడు వెంకీ ని కూడా ట్యాగ్ చేయడం జరిగింది. అయితే అతడి ట్వీట్ ని చూసి వెంటనే స్పందించిన దర్శకుడు వెంకీ, ఆవేదనతో ఒక ట్వీట్ చేసారు. 

 

మేము ఎంతో కష్టపడి కోట్ల రూపాయల ఖర్చుతో సినిమాలు తీస్తుంటే, వాటిని దెబ్బకొట్టేలా ఈ విధంగా పైరసీ చేసి బస్సులు వంటి వాటిలో ప్రదర్శించడం నిజంగా దారుణం అంటూ ఆవేదనతో ట్వీట్ చేస్తూ, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ట్యాగ్ చేస్తూ, మాకు ఎటువంటి కష్టం వచ్చినా మీరే చూసుకోవాలి, దయచేసి ఇటువంటివి జరుగకుండా చూసుకోండి అంటూ ఆయనకు విన్నవించడం జరిగింది. నిజానికి ఎంతో మంది కొన్ని నెలల పాటు ఎంతో కష్టపడి కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీస్తుంటే, వాటిని పైరసీ చేసి చూడడం నేరం అని, ఇకపై ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని పలువురు సినీ విశ్లేషకులు కోరుతున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: