అక్కినేని బ్రదర్స్ అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్ సినిమాలలో వరుసగా నటించింది అందాల భామ నిధీ అగర్వాల్. నిజంగా చూడటానికి నిధీ అద్భుతంగా ఉంటుంది. ప్రేక్షకులకి బాగా నచ్చింది. సూపర్ ఫిజిక్, మంచి బాడీ లాంగ్వేజ్, అందం, గ్లామర్ డోస్.. ఇలా నిధీ అన్నిటిలో సూపర్ అని అనిపించుకుంది. కానీ యాక్టింగ్ లోనే కాస్త అటు ఇటూ గా ఉందని కామెంట్స్ వచ్చాయి. అందుకు తగ్గట్టే ఈ అమ్మడికి రెండు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు పడ్డాయి. అది కూడా ఒకే ఫ్యామిలీ హీరోలకి చెందిన సినిమాలు. ఒకటి నాగ చైతన్య నటించిన సవ్య సాచి కాగా రెండవది అఖిల్ నటించిన మిస్టర్ మజ్ఞు. ఈ రెండింటితో నిధీ చాప్టర్ టాలీవుడ్ లో క్లోజ్ అని ఫిక్సైపోయారు. కానీ పూరీ సామాన్యుడు కాదు కదా ..ఎలాంటి అమ్మాయైనా పూరీ చేతిలో పడితే జాతకం మారిపోవాల్సిందే. 

 

నిధీ విషయంలోనూ అదే జరిగింది. ఆయన దర్శకత్వంలో రాం హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు పూరి. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు ఏ ఒక్కరికి అంతగా అంచనాలు లేవనే చెప్పాలి. ఎందుకంటే పూరి సక్సస్ ట్రాక్ రికార్డ్ అలా ఉంది. వరుసగా ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న పూరికి ఇస్మార్ట్ శంకర్ ఎలా హెల్ప్ అవుతుందో అని అందరూ అనుకున్నారు. పూరి టీం కూడా హిట్ అన్న టాక్ వస్తే చాలు..గట్టెక్కినట్టే అని అనుకున్నారు. కానీ ఇస్మార్ట్ శంకర్ పూరీ టీం తో సహా ఇండస్ట్రీలో వాళ్ళకి ప్రేక్షకులకి పెద్ద షాకిచ్చింది. మార్నింగ్ షో నుండే సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. ఇక ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ కి మంచి పేరొచ్చింది. 

 

ముఖ్యంగా నిధీ కి మంచి పాపులారిటీ వచ్చింది. మొదటి రెండు సినిమాలతో రాని నేం అండ్ ఫేం పూరి ఇస్మార్ట్ శంకర్ తో వచ్చింది. నిధీ లోని టాలెంట్ ని పూరి ఈ ఒక్కసినిమాలోనే వాడేశారు. అయితే నిధీ పూరి నుండి ఇంకో సినిమా ఆశించిందట. విజయ్ దేవరకొండ తో చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా నిధీ పేరు ప్రస్తావనకొచ్చింది. కానీ ఎందుకనో నిధీ ని తీసుకోలేదు పూరి. దాంతో కాస్త ఆశలు పెట్టుకున్న నిధీ నన్ను పూరి సార్ ఒక్కసినిమాలో మొత్తం వాడేశారు ఇంకో సినిమాలో మళ్ళీ నన్ను ఎప్పుడు తీసుకుంటారో నా టాలెంట్ ని ఎప్పుడు వాడుకుంటారో అంటూ ఫీలవుతుందట. ఇక గల్లా అశోక్ హీరోగా నటిస్తున్న సినిమాలో నిధీ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: