టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా పరిచయం అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయన నటించిన గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ సినిమాలతో మంచి విజయాలు అందుకున్న పవన్ కళ్యాణ్, అప్పటి యువత లో మంచి క్రేజ్ సంపాదించి హీరోగా గొప్ప పేరు గడించారు. ఆపై ఆయన హీరోగా తెరకెక్కిన బద్రి, ఖుషి సినిమాలు పవన్ ఇమేజ్ ని మరింత పైకి తీసుకువెళ్లడంతో పాటు, ఆయన మార్కెట్ విలువను కూడా అమాంతం పెంచేశాయి. ఆ తర్వాత తానే సొంతంగా దర్శకత్వం వహించి నటించిన జానీ సినిమా ఖుషి తర్వాత రెండేళ్ల గ్యాప్ అనంతరం రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా పరాజయం అందుకుంది. అయితే అదే సమయంలో పవన్ కళ్యాణ్ పై వచ్చిన కొన్ని వార్తలు అప్పట్లో సంచలనం రేపాయి. 

 

అప్పటి టిడిపి ఎమ్మెల్యే పరిటాల రవి కి పవన్ కు మధ్య ఒక విషయంలో కొద్దిపాటి వివాదం జరిగిందని, కాగా ఆ వివాదం లో పరిటాల, పవన్ కళ్యాణ్ కి గుండు కొట్టించారని కొందరు వార్తలు ప్రచారం చేయడం జరిగింది. అంతేకాక ఒక ప్రముఖ పత్రికలో కూడా ఆ వార్త అప్పట్లో ప్రచురితం అవ్వడంతో, పవన్ ఆ పత్రిక ఆఫీసు ఎదుట నిరసన కూడా నిర్వహించారు. అయితే ఆ ఘటనపై నిర్మాత అల్లు అరవింద్ స్పందిస్తూ, నిజానికి పవన్ కళ్యాణ్ కు పరిటాల రవి కి మధ్య ఎటువంటి ముఖ పరిచయం కూడా లేదని, మరి ఏ విధంగా పవన్ ఆయనతో గొడవ పడ్డారని సదరు పత్రిక వారు ఆ వార్త రాశారో తనకు అర్థం కాలేదని ఆయన వెల్లడించడం జరిగింది. 

 

చాలా ఏళ్ల పాటు ఎంతో ప్రచారమైన ఆ వార్తలో ఎటువంటి వాస్తవం లేదని, కావాలనే కొందరు అప్పట్లో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో పనిగట్టుకు మరి, ఆ కల్పిత వార్తని ప్రచారం చేశారని విశ్లేషకులు కూడా అప్పట్లో చెప్పడం జరిగింది. నిజానికి ఆ ఘటన విషయమై ఇప్పటికీ కూడా ఎక్కడా ఎటువంటి ఆధారాలు లేవని, కావున అది పూర్తిగా ఫేక్ న్యూస్ అని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: