గత కొద్ది రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో హీరో మహేష్ బాబు తదుపరి చిత్రంపై ఒకటే టాక్ నడుస్తోంది. సరిలేరు నీకెవ్వరు విజయం తర్వాత తన తదుపరి సినిమాని వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో మహేష్ చేయనున్నాడని ముందు నుంచి బలమైన వార్తలు ఉన్నాయి. అయితే వంశీ సరైన స్క్రిప్ట్ ని రెడీ చేయడంలో విఫలమయ్యారని మహేష్ దానిని క్యాన్సిల్ చేసుకున్నాడన్న వార్తలు కూడా వచ్చాయి.

 

తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్లో మహేష్ చేయబోయే సినిమాకు పరశురాం దర్శకత్వం వహించనున్నట్లు వార్తలు రావడంతో ఇక వంశీ పైడిపల్లి సినిమా అటకెక్కిందని అందరూ ఫిక్స్ అయ్యారు. గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాతో  పరశురామ్ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు కానీ మహేష్ కు మహర్షి లాంటి మంచి సినిమా అందించిన వంశీ పైడిపల్లి తో మళ్లీ ఇప్పుడు సినిమా కచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది.

 

విషయం ఏమిటంటే స్క్రిప్ట్ ను రీ-వర్క్ చేయాల్సిందిగా మహేష్ కోరడంతో వంశీ ఉప్పుడు అదే పనిలో బిజీగా ఉన్నాడట. స్క్రిప్ట్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి మహేష్ తో సినిమా ఎలాగైనా మొదలుపెట్టాలని వంశీ కూడా చాలా పట్టుదలగా ఉన్నాడు.

 

దీంతో కాంబోలో సినిమా ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. మరి వంశీతో సినిమా ఉంటే, పరశురామ్ సంగతి ఏమిటని పలువురు అంటున్నారు. అయితే రోజుకొక మాట మారుస్తూ ఉండడంతో మహేష్ బాబు అభిమానులు మాత్రం చాలా కోపం గా ఫీల్ అవుతున్నారు. ఈమధ్య మహేష్ కు స్క్రిప్ట్పై జడ్జిమెంట్ కొంచెం తగ్గిందని పలు విమర్శలు చేస్తుండగా ఫ్యాన్స్ మాత్రం ఇంకా మంచి దర్శకుడితో సినిమా చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: