అక్కినేని నాగ చైతన్య, సమంత లవ్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీ కపుల్ గా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఓ పక్క వరుస సినిమాలు చేస్తూనే మరోపక్క పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ మజిలె, వెంకీమామ సినిమాలతో చైతు హిట్ ట్రాక్ ఎక్కగా సమంత వరుస హిట్లతో దూసుకెళ్తుంది. అయితే రీసెంట్ గా వచ్చిన జాను సినిమా సమంతకు మంచి నటిగా మరోసారి గుర్తింపు తెచ్చినా సినిమా కమర్షియల్ గా మాత్రం వర్క్ అవుట్ కాలేదు. 

 

ఈ విషయంపై సమంత లేటెస్ట్ గా స్పందించిన విధానం కూడా అందరిని మెప్పించింది. ఇదిలాఉంటే ఇప్పటివరకు అక్కినేని ఫ్యామిలీలో అన్నపూర్ణ సంస్థ ఒకటి మాత్రమే సినిమాలు తీసేది. ఇక ఇప్పుడు కొత్తగా మరో ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేస్తున్నారట చైతు, సమంతలు. ఈమధ్యనే బ్యానర్ పేరు రిజిస్టర్ చేయించారట. ఏ.ఎన్.ఎస్ అంటే అక్కినేని నాగ చైతన్య, సమంత బ్యానర్ స్థాపించారు. త్వరలో ఈ బ్యానర్ అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ తో పాటుగా ఓ మీడియం రేంజ్ సినిమా ఒకటి స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది.

 

అయితే చైతు, సమంత ఏ.ఎన్.ఎస్ బ్యానర్ కు నాగార్జున ఆమోదం ఉందా.. లేక ఆయనకు ఇష్టం లేకపోయినా ఈ బ్యానర్ స్థాపించారా అన్నది తెలియాల్సి ఉంది. ఈమధ్య అక్కినేని ఫ్యామిలీలో నాగ్ కన్నా సమంత, చైతులో ఎక్కువ ఫాం లో ఉన్నారు. అందుకే సొంత బ్యానర్ కు ఇదే పర్ఫెక్ట్ టైం అని రిజిస్టర్ చేయించారు. ఏ.ఎన్.ఎస్ బ్యానర్ నుండి వచ్చే మొదటి సినిమా చైతు, సమంతలే నటిస్తారా లేక మరో హీరోతో చేస్తారా అన్నది చూడాలి. ప్రస్తుతం చైతు శేఖర్ కమ్ముల డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత సినిమా ఎవరితో అన్నది ఇంకా నిర్ణయించలేదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: