తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత గురించి అందరికి తెలిసిందే. అటు సినిమాల్లో అయినా ఇటు రాజకీయాల్లో అయినా సరే ఆ కుటుంబానికి తిరుగు లేదు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జరిగిన మార్పులు, చోటు చేసుకున్న పరిణామాలు అన్నీ ఇన్నీ కావు. ఇక నందమూరి కుటుంబం సినిమాల మీద కూడా ఎంతో ప్రభావం చూపించింది అనే మాట వాస్తవం. ఎన్టీఆర్ నుంచి ప్రస్తుతం ఉన్న జూనియర్ ఎన్టీఆర్ వరకు ఎన్నో విజయవంతమైన సినిమాలు ఆ కుటుంబం నుంచి వచ్చాయి అనేది వాస్తవం. 

 

అయితే నందమూరి హీరోలు మాత్రం ఇప్పుడు కలిసి లేరు. దీనికి కారణం ఎవరూ అనేది స్పష్టంగా తెలియకపోయినా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాలకు కారణం చంద్రబాబు అని అంటారు. నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు విభజించి పాలించడమే దీనికి కారణమని అంటారు. 2009 ఎన్నికల ప్రచారం సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ని వాడుకున్న చంద్రబాబు... ఎన్టీఆర్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో పార్టీ ఓడిపోయింది అంటూ తమ అనుకూల పత్రికలో కథనాలు ప్రసారం చేసారు. దీనితో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ విడిపోయారని అంటారు. 

 

పార్టీ ఓటమికి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారమే కారణమని బాలకృష్ణ కూడా పలు సందర్భాల్లో అన్నారని సోషల్ మీడియాలో కూడా మొన్నామధ్య వార్తలు వచ్చాయి. హరికృష కు ఎమ్మెల్యే సీటు ఇవ్వని చంద్రబాబు, బాలకృష్ణ కు మాత్రమే ఇచ్చారని, ఆ తర్వాత విభేదాలు మళ్ళీ ఎక్కువగా పెరిగిపోయాయి అనేది కూడా కొందరి మాటగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఒకరికి ఒకరు దూరంగా ఉన్నారు. వాళ్ళ మధ్య ఏదో జరుగుతుంది అనే ప్రచారం కూడా సోషల్ మీడియా ఒక రేంజ్ లో చేస్తూ ఉంటుంది. ఎన్టీఆర్ కి ఇగో ఎక్కువ.. ఆ ఇగో మీద బాలకృష్ణ దెబ్బ కొట్టారు. అందుకే ఎన్టీఆర్ ఇప్పుడు కుటుంబానికి దూరంగా ఉన్నారని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: