యాంకర్ అనసూయ వర్సెస్ ఎమ్మెల్యే రోజానా..? అదేంటి.. ఎప్పుడూ ఎంతో సంతోషంగా కలిసుండే వీరిద్దరి మధ్య యుద్ధం ఏంటి..? ఇలా అనేక ప్రశ్నలు మీకొస్తుంటాయి. మరి వాటికి సమాదానాలు తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లిపోదాం. సాధారణంగా మన తెలుగులో ఉన్న అన్ని కీలక ఛానెల్స్ లోను సీరియల్స్ కామన్ గానే ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఇప్పుడు మారుతున్న కాలంలో ఎంటర్టైన్మెంట్ కు వీక్షకులు పెద్ద పీట వేస్తున్నారు. ఈ క్రమంలోనే జెమినీ టీవీ వారు గత కొన్ని రోజులుగా ప్రతీ సోమవారం నుంచి శనివారం వరకు మొత్తం ఐదు సరికొత్త షోలు స్టార్ట్ చేయబోతున్నట్టు తెలిపారు.
ఇందులో భాగంగా కొన్ని ప్రోమోలు కూడా విడుదల చేశారు. అందులో యాంకర్ అనసూయ “తల్లా? పెళ్లామా?” అనే సరి కొత్త షోతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్చి 2వ తేదీ నుండి ప్రసారమవనున్న ఈ షో టైటిల్ కాస్త విచిత్రంగా ఉన్నప్పటికీ.. ఈ షో పై అంచనాలు బాగానే పెరిగిపోతున్నాయి. అమ్మ, భార్య మధ్య జరిగే సరదా సంఘటనలే ఈ షో కాన్సెప్ట్. అలాగే మరోవైపు రోజా అమ్మ సరిలేరు నీకెవ్వరు అంటూ జెమినిలో కొత్త షో ఒకటి మొదలుపెట్టబోతుంది. అమ్మల గొప్పతనం.. పిల్లలతో వాళ్లు చేసే అల్లరి ఈ షోలో హైలైట్ చేయబోతున్నారు. ముఖ్యంగా మోడ్రన్ అమ్మలు ఈ షోలో కనిపిస్తారు.
మార్చ్ 3 నుంచి రాత్రి 9.30కు ఈ షో ప్రసారం కానుంది. ఇక ఈ రెండు షోలు జెమినీ టీవీలోనే. దీంతో వీరిద్దరి మధ్య యుద్ధం జరిగేలా కనిపిస్తుంది. ఎందుకంటే.. ఓ వైపు తల్లా పెళ్లామా అంటూ అనసూయ అడుగుతుంటే.. తల్లే గొప్ప అంటూ రోజా కార్యక్రమం చేస్తుంది. దాంతో ఈ ఇద్దరి మధ్య మంచి టిఆర్పీ వార్ జరిగేలా కనిపిస్తుంది. పైగా రెండూ ఒకే ఛానెల్లో రావడం మరింత ఉత్కంఠ నెలకొల్పింది. మరి ఈ యుద్ధంలో ఎవరు ఎక్కువ టీఆర్పీ రేటింగ్స్ సొంతం చేసుకుంటారో.. ఎవరు ఎవరిని డోమినేట్ చేస్తారో తెలియాలంటే మిస్ కాకుండా ఈ షోలను చూడాల్సిందే.