బాలీవుడ్ జనాలకి దక్షిణాది సినిమాలంటే బాగా ఇష్టం ఏర్పడింది. ఒకప్పుడు మన కథల్ని సాంబార్ ఇడ్లీ కథల్ని చిన్న చూపు చూడడమే కాకుండా, మన దర్శకులకి సరైన విలువ ఇచ్చేవాళ్ళు కాదు. కానీ అలాంటి వారే నేడు మన దర్శకులని, మన సినిమాలని నెత్తిన పెట్టుకుంటున్నారు. దానికి ఒకే ఒక్క కారణం ’కంటెంట్’. దక్షిణాది సినిమాల్లో ఎన్నో ప్రయోగాత్మకమైన సినిమాలు వస్తున్నాయి. విభిన్నమైన కథాంశాలతో యూనివర్సల్ అప్పీల్ ఉన్న సినిమాలు తెరకెక్కుతున్నాయి.

 

 

అందువల్ల బాలీవు జనాలకి మన మీద దృష్టి పడింది. మన సినిమాలు హిందీలో రీమేక్ అవడమే కాదు అక్కడ జనాలని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా మాస్ చిత్రాలకి ఉత్తరాదిన బాగా క్రేజ్ ఏర్పడింది. అందుకే ఇక్కడ రిలీజ్ బంపర్ హిట్ కొట్టిన మాస్ చిత్రాలన్నింటికి హిందీలో రీమేక్ చేస్తున్నారు. అందులో భాగంగానే తమిళ చిత్రమైన ఖైతీ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

 

ఈ విషయమై అధికార సమాచారం వచ్చేసింది. అజయ్ దేవగణ్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుందట. తమిళంలో కార్తి నటించిన ఈ సినిమా ప్రేక్షకుల వద్ద మంచి మార్కులే తెచ్చుకుంది. హీరోయిన్ లేకుండా, పాటలు లేకుండా విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. దాంతో బాలీవుడ్ కి రీమేక్ కి వెళ్ళిపోయిందొ. అయితే మొదటగా రీమేక్ చేద్దామని భావించినపుడు చాలా పెద్ద పెద్ద స్టార్ల పేర్లు వినిపించాయి.

 

 

అందులో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ లు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరూ ఖైతీ కథని రిజెక్ట్ చేసారట. అలాంటి ప్రయోగాత్మక సినిమాల్లో వారు నటించలేమని చెప్పారట. వారిద్దరూ రిజెక్ట్ చేశాకే అజయ్ దేవగణ్ చేతికొచ్చిందని సమాచారం. అజయ్ దేవగణ్ ప్రయోగాలని ఇష్టపడతాడు. అందుకే ఈ సినిమా ఒప్పుకున్నాడని అంటున్నారు. మరి తమిళంలో లాగే హిందీలోనూ ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: