ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తున్న అంటు వ్యాధి అయిన కరోనా తిరిగి తిరిగి మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా తాకింది. ఇప్పటికే శాస్త్రవేత్తలు దీనికి మందు కనిపెట్టలేక తలలు పట్టుకుని ఉంటే దీని బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ సోకిన ఒక వ్యక్తి తిరుమలలో ఉన్నాడు. తాజాగా తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో కరోనా వైరస్ లక్షణాలతో రోగికి చికిత్స చేయించుకునేందుకు చేరడం తీవ్రమైన కలకలం రేపింది. అందులోను వ్యక్తి చైనాకు చెందిన వాడే కావడం అందరినీ మరింత కలవరపెడుతోంది.

 

IHG

 

చైనాకు చెందిన ఒక టెక్నీషియన్ స్థానిక బంగారుపాళ్యం దగ్గరున్న ఒక ప్రైవేటు ఫ్యాక్టరీలో మరమ్మతులు చేసేందుకు భారత్ కు వచ్చాడు. రెండు రోజులుగా తీవ్రమైన జలుబు మరియు దగ్గు తో బాధపడుతున్న అతను రుయా ఆస్పత్రిలో చేరగా రక్త నమూనాలు సేకరించి వైద్యులు ల్యాబ్ కు పంపారు. ఇప్పటికే అతను చూపిస్తున్న లక్షణాలు అన్నీ కరోనా వైరస్ సోకిన సంకేతాలు పంపుతుండగా.... అదీ కాకుండా అతడు చైనాకు చెందిన వాడు కావడంతో కచ్చితంగా ల్యాబ్ రిపోర్ట్ లో అతనికి కరోనా వైరస్ సోకిండని వస్తుంది అని అంతా భయపడుతున్నారు. మరొక రెండు రోజుల్లో అతని ఫలితాలు రానున్నాయి.

 

IHG

 

భారీ జనసమూహాలు తిరిగే తిరుమల-తిరుపతిలో ప్రవేశిస్తే ఏమైనా ఉంటుందా.. లక్షల మంది దర్శించుకునే తిరుమలలో వ్యాధి ప్రబలితే ఊహించడానికే వీలులేని అపార నష్టం వాటిల్లుతుంది. అయితే భయం ప్రస్తుతం తిరుపతిలో చోటుచేసుకుంది. క్రమంలోనే భారత్ అప్రమత్తమైంది. చైనా సహా ఇరాన్ దక్షిణ కొరియా పాకిస్తాన్ నుంచి ఎవరూ రాకుండా నిషేధం విధించింది. ప్రస్తుతం చైనా నుంచి వచ్చిన రోగిని ప్రత్యేకంగా ఉంచి చికిత్స చేస్తున్నారు. కేంద్రం అలెర్ట్ ప్రకటించి విదేశీయులను భారత్ కు రాకుండా నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: