యాంక‌ర్ అన‌సూయ‌తో చిరంజీవి రొమాన్స్ ఏంటి..? రామ్ చ‌ర‌ణ్‌కు చెప్పిద్ద‌న‌డం ఏంటి..? అనుకుంటున్నారా..? అవును! అది నిజ‌మే. కానీ, ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ ఉంది. యాంకర్ అనసూయ తన అందచందాలతో జబర్దస్త్ కు కొత్త క్రేజ్ తెచ్చిపెట్టింది. ఒక దశలో ఈ భామను జనం జబర్దస్త్ భామగా గుర్తుంచుకున్నారంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలలో ఈ భామ కూడా ఒకరు. అయితే అనసూయ కేవలం టీవీ యాంకరింగ్‌ మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ అక్కడ కూడ దూసుకుపోతోంది. 

 

ఇక ఇటీవ‌ల చిరంజీవి కూడా రొమాంటిక్ అయిపోయారు. రాజకీయాలు వదిలేసి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత ఆయ‌న‌లోని కొత్త కొత్త కోణాలను బ‌ట‌య‌కు తీసుకున్నారు. ఆ మధ్య సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుకలో విజయశాంతితో ఈయన చేసిన రొమాన్స్ అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు కూడా చిరు అదే చేసాడు. తాజాగా ఈయన ఓ పిట్ట కథ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చాడు. బ్రహ్మజీ కుమారుడు సంజయ్ రావు ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. నిత్యశెట్టి, విశ్వాంత్ కీలక పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి చెందు ముద్దు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

 

అయితే ఈ వేడుక‌కు యాంక‌ర్ అనసూయ కూడా చీఫ్ గెస్టుగా వచ్చింది. అక్కడే ఉన్న చిరంజీవి స్టేజి ఎక్కిన తర్వాత ఆమెతో సరసాలాడాడు. అదీ మాటల్లోనేలెండీ. రంగస్థలం సినిమా ద్వారా చిరూకు ఎంతో ద‌గ్గ‌రైన అన‌సూయ‌ను రంగమ్మ అని పిలుస్తాడీయ‌న‌. ఈ క్రమంలోనే ఈ సినిమాలో మీరు కూడా ఉన్నారా లేదంటే గెస్టుగా వచ్చారా అంటూ అనసూయను అడిగిన వెంటనే గుండె పట్టుకున్నాడు చిరంజీవి. ఈ మధ్యే అన్ని టెస్టులు చేయించుకున్నాను గుండె బాగానే ఉందన్నారు కానీ ఇప్పుడు ఎందుకో మరి కాస్త నొప్పి వచ్చిందంటూ అనసూయ వైపు చూస్తూ కామెంట్ చేసాడు మెగాస్టార్. 

 

ఇలా అన్నీ అనేసిన తర్వాత రామ్ చరణ్‌కు చెప్పొద్దమ్మా అంటూ అనసూయను కోరాడు మెగాస్టార్. ఇలా అక్క‌డ చిరు చేసిన రొమాంటిక్ కామెడీకి అక్కడున్న వాళ్లంతా తెగ న‌వ్వేశారు. మ‌రోవైపు అన‌సూయ కూడా ఇది చాలు సర్ నాకు అంటూ చిరు వైపు చూస్తూ నవ్వేసింది. ఇలా అంద‌రితో క‌లిసిపోయి ఓ పిట్ట కథ సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌లో కాసేపు న‌వ్వులు పూయించాడీయ‌న‌..!

మరింత సమాచారం తెలుసుకోండి: