టాలీవుడ్ లోకి రామ్ పోతినేని హీరోగా నటించిన ‘నేను శైలజ’ తో పరిచయం అయ్యింది మాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్.  తల్లీ మోహిని గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘పున్నామిరాత్రి’ మూవీలో నటించింది.  తల్లిదండ్రులు సినీ పరిశ్రమకు చెందిన వారు కావడంతో ఈ అమ్మడు ఎంట్రీ ఈజీగానే సాగినా.. తన నటనతో ప్రేక్షకుల మనుసు దోచేస్తుంది.  నేను శైలజ తర్వాత నాని హీరోగా నటించిన ‘నేను లోకల్’ మూవీతో మంచి విజయం అందుకుంది.  ఈ రెండు సినిమాల తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒకప్పటి తెలుగు చలన చిత్ర పరిశ్రలో మహానటిగా గుర్తింపు తెచ్చుకున్న సావిత్రి బయోపిక్ ‘మహనటి’ మూవీలో నటించి తెలుగు, తమిళ ప్రేక్షకుచే జేజేలు పలికించుకుంది.

 

ఈ మూవీలో అచ్చం సావిత్రిలా కనిపించిన కీర్తి సురేష్ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.  మహానటి తో మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ తెలుగు, తమిళ, మళియాళ భాషలతో పాటు హిందిలో కూడా నటిస్తుంది.  ప్రస్తుతం ప్రస్తుతం 'మిస్ ఇండియా' అనే సినిమాలో ప్రధాన పాత్రపోషిస్తుంది. ఇక అచ్చం తెలుగమ్మాయిలా ఉండే కీర్తి. ఇప్పుడు ఉన్నటుంది మలయాళీ  కుట్టి లా మారిపోయింది. మలయాళీ సాంప్రదాయ వస్త్రాల్లో మెరిసింది కీర్తి. అసలు విషయమేంటంటే.. ప్రస్తుతం మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో `మరక్కర్ అరబిందలింటే సింహామ్’ అనే మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

 

పిరియాడికల్ మూవీగా తెరకెక్కతున్న నేపథ్యంలో కీర్తి సురేష్ లుకింగ్ పరంగా సాంప్రదాయంగా కనిపించబోతుందట.  ఇందులో కీర్తి మలయాళ కుట్టీగా కనిపించనుంది.   కీర్తి సురేష్ అక్కడి అమ్మాయే కాబట్టి అక్కడి సాంప్రదాయ వస్త్రాల్లో ఇట్టే ఒదిగిపోయింది. ఈ లుక్ పై నెట్టింట ప్రసంశలు కురిపిస్తున్నారు అభిమానులు.  ఈ మూవీస్ మంచి హిట్ అందుకుంటే మాత్రం కొంత కాలం స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయే అవకాశం ఉందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: