సినీ జ‌నాల‌కు అతిలోక సుంద‌రిని ప‌రిచ‌యం చేసిన న‌టి శ్రీ‌దేవి. నేటి త‌రం హీరోయిన్ల‌కు తాను ఏ మాత్రం తీసిపోన‌ని శ్రీ‌దేవి నిరూపించుకుంది. ఈ క్ర‌మంలోనే ఇండియాలోని అన్ని సినీ ఇండస్ర్టీల్లోనూ స్టార్ హీరోయిన్ క్రేజ్‌ను అనుభ‌వించింది తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయింది. అయితే త‌న కూతుళ్లు సినీ ఇండ‌స్ర్టీలోకి ఆరంగ్రేటం చేస్తున్న స‌మ‌యంలో కూడా శ్రీ‌దేవి త‌న సొగసుల‌కు ప‌దును త‌గ్గ‌లేద‌ని నిరూపించిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆమె కూతుళ్లు జాహ్నవి, ఖుషీకపూర్ బికినీ డ్ర‌స్సుల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాల‌ను ఊపేస్తున్నారు.

 

ఇక గ‌తంలో దివంగ‌త‌ శ్రీదేవి తన భర్త బోనీకపూర్, ఇద్దరు కూతుళ్లు జాహ్నవి, ఖుషిలతో కలిసి మాల్దీవులలో సముద్రవిహారం చేస్తూ ఎంత ర‌చ్చ చేశారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.  అక్క‌డ తన కూతుళ్ళ తరహాలోనే బికినీ వేసుకొని ఫుల్ గా ఎంజాయ్ చేసింది. అంతే కాకుండా తను ఎంతగా ఎంజాయ్ చేసానో చూడండి అనే విధంగా ఫోటోలను సామాజిక మ‌ధ్య‌మాల్లో పెట్టి.. తన ఫ్యాన్స్‌కి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలిపింది. దీంతో ఆ ఫోటోలు వైర‌ల్ అవ్వ‌డ‌మే కాకుండా.. విమ‌ర్శ‌ల‌కు కూడా గుర‌య్యాయి. ఇక  శ్రీ‌దేవి మ‌ర‌ణించిన త‌ర్వాత కూడా జాహ్నవి, ఖుషిలు ఎప్ప‌టిక‌ప్పుడు పొట్టి బ‌ట్ట‌ల‌తో ద‌ర్శ‌నం ఇస్తూ పాపుల‌ర్ అవుతున్నారు.

 

ముఖ్యంగా జిమ్‌కు వెళ్లే సమయంలో జాహ్నవి పొట్టిగా ఉండే షార్ట్స్ ధరించి తన అందంతో అల్లాడిస్తుంది. జిమ్ బయట వెయిట్ చేస్తున్న ఫోటో గ్రాఫర్లకు హాట్ హాట్ ఫోజులు ఇస్తూ వార్తల్లో నిలుస్తోంది. అయితే ఇలా పొట్టి బ‌ట్ట‌లు వేయ‌డం మ‌రియు హాట్ హాట్ లుక్స్‌తో నెట్టింట్లో వైర‌ల్ అవ్వ‌డం.. కేవ‌లం సినిమాల ఛాన్సుల కోస‌మే అంటూ విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు కొంద‌రు.  కాగా, ఇప్ప‌టికే  జాన్వీ కపూర్ నటించిన ధడక్ సినిమా మంచి విజయం అందుకుంది. ఒక్క సినిమాతోనే జాన్వీకి దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ వచ్చింది. కానీ, ప్ర‌స్తుతం జిమ్ కి వెళ్లినా, ఫంక్షన్ కి వెళ్లినా పొట్టి బట్టలే వేసుకుని అందరిని తననే చూసేలా చేసుకుంటుంది. దీంతో ఆమెపై కొంద‌రు కాస్త అస‌హనం వ్య‌క్తం చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: