ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అందరూ బికినీలతో ప్రేక్షకులను కనువిందు చేస్తున్నారు. సినిమా అవకాశాలు ఉన్నా లేకున్నా సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్ అవుతుంటారు కొందరు సుందరీమణులు. వెండితెరపై అందాలను ఆరబోసి ఫ్యాన్స్ను పిచ్చెక్కిచ్చే అవకాశాలు లేకున్నా.. సామాజిక మధ్యమాల్లో అందాల ఎర వేస్తుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల కొందరు హీరోయిన్లు బికినీ ఫోటోలతో అందాలను చూపిస్తూ అభిమానులకు గాలమేస్తున్నారు. అందులో టాలీవుడ్కు చెందిన జీవిత రాజశేఖర్ కూతుళ్లు కూడా ఉన్నారు.
2020 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఫుల్లుగా ఎంజాయ్ చేశారు జీవితరాజశేఖర్ కూతుళ్లు. ఇటీవల శివానీ, శివాత్మికలు న్యూ ఇయర్ సందర్భంగా చిల్ అవుతున్న ఫొటోలు బయటికి వచ్చాయి. వీరిద్దరూ తమ స్నేహితులతో కలిసి సింగపూర్ వెళ్లారు. అక్కడి మరీనా బే సాండ్స్ రిసార్ట్స్లో బిల్డింగ్పై కట్టిన స్విమ్మింగ్ పూల్లో శివానీ, శివాత్మికలు బికినీలు వేసుకుని ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఈ ఫొటోలను శివానీ సామాజిక మధ్యమాల్లో పోస్ట్ చేశారు. దాంతో ఈ ఫొటోలు కాస్తా తెగ వైరల్ అవ్వడమే కాకుండా.. విమర్శలకు కూడా గురయ్యాయి.
ఇక ఇటీవల జీవిత రాజశేఖర్ ఓ సినిమా ట్రైలర్ లాంచ్ చేసి.. ఆ తర్వాత ఆ ట్రైలర్పై పెద్ద రచ్చే చేసింది. మరి కూతుళ్లు బికినీ షో చేస్తుంటే ఎందుకు ప్రశ్నించడం లేదని అప్పట్లో చాలా మంది కామెంట్లు చేశారు. మరియు ఇలాంటి బికినీ షోలు చేయడం సినిమా ఛాన్సుల కోసమా లేదా పాపులర్ అవ్వడానికా..? అన్ని ప్రశ్నించిన వాళ్లు లేకపోలేదు. కాగా, శివానీ, శివాత్మికల సినిమాల విషయానికొస్తే.. రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని తమిళంలో అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ‘2 స్టేట్స్' అనే సినిమాలో నటించింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను తాత్కాలికంగా నిలిపి వేయడం జరిగింది. ఇక శివాత్మిక దొరసానిగా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచమైన సంగతి తెలిసిందే.