టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే.. జల్సా సినిమాతో మొదలైన వీరి కాంబినేషన్ లో అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి లాంటి సినిమాలు వచ్చాయి. ఇందులో జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు మంచి హిట్టు కాగా, అజ్ఞాతవాసి నిరాశపరిచింది. అయితే అజ్ఞాతవాసి మూవీలో ఇంట్రవెల్ తర్వాత పవన్ కళ్యాన్ ని స్థాయికి తగ్గట్టు లేదని విమర్శలు వచ్చాయి. అజ్ఞాతవాసి తర్వాత పవన్ కళ్యాన్ పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. అయితే మళ్లీ త్రివిక్రమ్ తో సినిమా తీస్తాడా లేదా అన్న ప్రశ్నలు అప్పుడు తలెత్తాయి. కానీ పవన్ మాత్రం ఓ వైపు రాజకీయకీయాల్లో ఉంటూనే.. వెండి తెరపై వెలిగిపోవాలని చూస్తున్నారు.
బాలీవుడ్ లో మంచి హిట్టు అయిన పింక్ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని దిల్ రాజు, బోని కపూర్ నిర్మిస్తుండగా, వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మద్య త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసారు. తాజాగా పవన్ అభిమానులు పండగ చేసుకునే ఆసక్తికర వార్త చిత్ర వర్గాల నుంచి వినిపిస్తోంది. పవన్ ని త్రివిక్రమ్ కలవడం.. మరో సినిమా చేసేందుకు కలిసారా లేదంటే ఫ్రెండ్షిప్లో భాగంగా కలిసారా అని రకరకాల వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా పవన్ నటించబోయే పింక్ సినిమాకి త్రివిక్రమ్ మాటలు అందించనున్నాడని తెలుస్తోంది.
అయితే పవన్ తో త్రివిక్రమ్ ఓ మూవీకి సిద్దమవుతున్నారని.. ఈమూవీ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే కాంబినేషన్ గతంలో జల్సాతో మొదలైంది. ఒకదశలో పవన్ కి మంచి టర్నింగ్ పాయింట్ ఇచ్చింది ఈ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీలో పవన్ కళ్యాన్ నటనకు యూత్ బాగా ఎట్రాక్ట్ అయ్యారు.