శ్రీదేవి శోభన్ బాబు... టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసిన జోడి ఇది. దాదాపు 7 సినిమాల్లో వీళ్ళు ఇద్దరూ కలిసి నటించారు. వీరు తెర మీద కనపడితే చాలు తెరకే ఒక అందం వస్తుంది అంటూ అప్పటి సినీ విశ్లేషకులు ఎన్నో సందర్భాల్లో అన్నారు. ఇప్పటికీ జోడి తెర మీద కనపడితే చాలు ప్రేక్షకులు అలా చూస్తుండి పోతారు. బుల్లి తెర మీద అయినా సరే ఈ జోడి సూపర్ హిట్ అయింది. వీళ్ళ సినిమాలు ఇప్పుడు వచ్చినా సరే ప్రేక్షకులు తప్పకుండా చూస్తుంటారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అన్నీ కూడా దాదాపు హిట్ అయ్యాయి. 

 

1980 లో చిరంజీవి శోభన్ బాబు కలిసి నటించిన సినిమాలో శ్రీదేవి హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా మంచి హిట్ అయింది. ఆ తర్వాత కార్తీకపౌర్ణమి అనే సినిమాలో ఈ జోడి అలరించింది. వీరి నటనకు మంచి ఆదరణ ఉండేది. 1983 లో వచ్చిన ముందడుగు సినిమాలో శ్రీదేవి, శోభన్ బాబు నటనకు ముగ్దులు అయిపోయారు ప్రేక్షకులు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. మరో హీరోగా ఆ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ నటించారు. ఈ సమయంలోనే శ్రీదేవి, శోభన్ బాబు ప్రేమలో ఉన్నారని అన్నారు. 

 

బంగారు చెల్లెలు అనే సినిమాలో కూడా ఈ జోడి ప్రేక్షకులను అలరించింది. కార్తీక దీపం సినిమాలో వీళ్ళు కలిసి నటించారు. ఇక వీరి కెరీర్ లో మైలురాయు గా చెప్పుకునే చిత్రం దేవత. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ ని షేక్ చేసింది. ఆ సినిమాలో జయప్రద, శ్రీదేవి హీరోయిన్లు గా నటించారు. ఆ సినిమాలో ఎల్లువచ్చి గోదారమ్మా ఎల్లా కిల్లా పడ్డానమ్మా అనే పాట ఇప్పటికీ టాలీవుడ్ ని ఊపేస్తుంది. ఆ సినిమాలో ఈ జోడి నటనకు ఫిదా అయిపోయింది బాలీవుడ్ కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: