బుల్లితెరపై ప్రేక్షకులను ఎంటర్ టైన్ మెంట్ ఎక్కడ తక్కువ గా ఉండదు. సరికొత్త షోలు వస్తూనే ఉంటాయి ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ ను పంచుతూనే ఉంటాయి. ఇలా ఎన్నో ఏళ్ల నుంచి బుల్లితెరపై తన సత్తా చాటుతూ ఒక ట్రెండ్ ను సృష్టించారు యాంకర్ దర్శకుడు నటుడు ఓంకార్. అప్పట్లో ఆట ప్రోగ్రాం తో సంచలనం సృష్టించి ఆ తర్వాత కొత్త కొత్త కాన్సెప్ట్ తో సరికొత్తగా ప్రోగ్రాం లతో బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ మెంట్ పెంచారు. అప్పట్లో ఓంకార్ చేసిన షో లన్ని టాప్ రేటింగ్ తో దూసుకుపోతూ బుల్లితెరను ఒక ఊపు ఊపాయి అని చెప్పాలి. ఇక మొన్నటికి మొన్న సిక్స్త్ సెన్స్ తో కూడా మంచి రేటింగ్ సంపాదించుకుని బుల్లితెరపై సత్తా చాటాడు ఓంకార్.
ఇక మొన్నటికి మొన్న సిక్స్త్ సెన్స్ షో ముగిసి పోగా తాజాగా మరో కొత్త ప్రోగ్రాంతో తెర మీదికి వచ్చి బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాడు. తాజాగా ఇస్మార్ట్ జోడి అనే సరికొత్త కాన్సెప్ట్ తో తెర మీదికి వచ్చాడు ఓంకార్. ఈ ప్రోగ్రాంలో భాగంగా బుల్లితెర సెలబ్రిటీ జోడి లందరిని ఈ ప్రోగ్రామ్ కు పిలిచి... వివిధ ఆటలతో ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్నాడు ఓంకార్. అంతే కాదు కొత్తగా వచ్చిన షో అయినప్పటికీ ప్రస్తుతం మాటీవీలో టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఏకంగా ఓంకార్ యాంకరింగ్ చేస్తున్న ఇస్మార్ట్ జోడి ప్రోగ్రాం 9.8 రేటింగ్ దూసుకుపోతూ సంచలనం గా మారిపోయింది.
ఇక బుల్లితెర లోని చాలా జోడీలు ఈ ప్రోగ్రాం కు వచ్చి ఇంటర్టైన్ చేస్తుండడంతో బుల్లితెర ప్రేక్షకులు అంత ఆసక్తి చూపుతున్నారు. ఓ వైపు ఈ షోలో ఓంకార్ తనదైన యాంకరింగ్ తో రక్తి కట్టిస్తుంటే... మరోవైపు బుల్లితెర సెలబ్రిటీ జోడి లతో ఎంటర్టైన్ చేస్తున్నారు. దీంతో మరోసారి బుల్లితెరపై ఓంకార్ సెన్సేషన్ సృష్టించాడు అనే చెప్పాలి. ఎన్నో ఏళ్ల నుంచి కొత్త కాన్సెప్ట్ లతో తెర మీదికి వచ్చి టాప్ రేటింగ్ తో దూసుకుపోతు... సత్తా చాటుతున్న ఓంకార్ మరోసారి బుల్లితెరను ఇస్మార్ట్ జోడి షో తో షేక్ చేస్తున్నాడు.