'బాహుబలి' వంటి భారీ విజయం తరువాత ఎస్ ఎస్ రాజమౌళి స్థాయి ఓ రేంజ్ లో పెరిగింది. అదే సమయంలో ఆ సినిమాలో హీరోగా చేసిన ప్రభాస్ రేంజ్ కూడా జరిగింది. ప్రస్తుతం ప్రభాస్సినిమా చేసినా ఆ సినిమాకి కొన్ని వందల కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. దీనంతటికి కారణం ఎస్ ఎస్ రాజమౌళి. అటువంటి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా RRR. ఒక్కసారి రాజమౌళి చేతిలో పడితే ఆ హీరో రేంజ్  ఒక్కసారిగా మారిపోతుందని టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరూ చెబుతూనే ఉంటారు. ఇటువంటి తరుణంలో జక్కన్న దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరియు ఎన్టీఆర్ కలసి నటిస్తున్న సినిమా 'RRR'. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే.

 

ఈ సినిమాని రాధాకృష్ణ మరియు కళ్యాణ్ రామ్ ఇద్దరూ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం తారక్ తీసుకుంటున్న పారితోషికం యొక్క న్యూస్ విని ల్యాండ్స్ అసలు సంతృప్తిగా లేరు. పూర్తి మేటర్ లోకి వెళ్తే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.  వీరిద్దరి రెమ్యునిరేషన్ ల గురించి రకరకాల వార్తలు వినబడుతున్నాయి. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ 40 కోట్ల పారితోషికం అందుకోబోతుండగా త్రివిక్రమ్ 20 కోట్ల పారితోషికంను తీసుకుంటున్నాడట.

 

'అల వైకుంఠపురంలో' చిత్రంతో బ్లాక్ బస్టర్ దక్కించుకున్న త్రివిక్రమ్ 20 కోట్ల పారితోషికమే తీసుకుంటున్నాడా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే రాజమౌళి సినిమా తర్వాత ఎన్టీఆర్ రేంజ్ పెరుగుతుందని రెమ్యూనరేషన్ కూడా పెరుగుతుందని భావించిన 40 కోట్లు మాత్రమే ఎన్టీఆర్ తీసుకుంటున్నట్లు వార్తలు రావడంతో చాలా నిరుత్సాహం చెందుతున్నట్లు సమాచారం. ప్రభాస్ 'బాహుబలి' తర్వాత చేసిన సినిమాకి 75 కోట్లు తీసుకుంటే...మనోడు ఏంటి 40 కోట్లు తీసుకుంటున్నాడు అని ఎన్టీఆర్ అభిమానులు చర్చించుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: