ప్రతి మనిషికి ఉన్న గుణం ఏంటంటే అప్పుడప్పుడు నోరుజారడం.. ఈ నోటిదూల వల్ల ఒక్కోసారి వ్యక్తుల మీదున్న అభిప్రాయాలు కూడా మారుతుంటాయి.. అయితే ఆనందం ఎక్కువైనప్పుడు, లేదా ఏదైనా సాధించినప్పుడు అనాలోచితంగానే కొన్ని మాటలు బయటకు వస్తాయి.. ఇలాంటి మాటలు ఇప్పుడు మాట్లాడవచ్చా లేదా అనేది ఆలోచించకుండా, ఎదుటు వ్యక్తి బాధపడతాడా లేదా అనేది పట్టించుకోకుండా.. ముందు ఓ మాట ఆనేయడం, తర్వాత ఫీలవడం జరుగుతాయి..
ఇలా ప్రవర్తించడం ఒక కామన్ పీపుల్స్కే కాదు సెలబ్రేటీల విషయంలో కూడా అప్పుడప్పుడు జరుగుతుంటుంది.. ఇలాగే ఒక సందర్భంలో దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా నోరు జారాడట.. అతను నోరుజారింది ఏ లైట్మెన్ దగ్గరో, మెకప్ మెన్ దగ్గరో, లేదా మామూలు వారి దగ్గరో కాదు.. శతాధిక చిత్రాల దర్శకుడు రాఘవేంద్రరావు దగ్గర. అవును ఇది నిజమని పూరిజగన్నాద్ స్వయంగా ఒప్పుకున్నారు..
అదేమంటే ఈ మధ్య అనుష్క చిత్రపరిశ్రమలో కాలు పెట్టి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, పూరి మాట్లాడుతూ, ‘సూపర్’ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో రాఘవేంద్రరావు నాగార్జున కోసం సెట్టుకు వచ్చారట. ఇక పూరి, రాఘవేంద్రరావు గారిని కలవడం అదే మొదటి సారట... ఇంతకు రాఘవేంద్రరావు గారు అక్కడికి ఎందుకు వచ్చారో తెలుసుకోవాలనే ఆసక్తితో, నేరుగా ఆయన దగ్గరికే వెళ్ళి అడిగాడట.. దానికి ‘నాగార్జున డేట్స్ కావాలి. అందుకే ఇక్కడికి వచ్చా’ అని ఆయన జవాబిచ్చారు.
అప్పటికి ఊరుకోని పూరిజగన్నాద్ సర్ నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడు మీరు తీసిన ‘అడవి రాముడు’ సినిమా చూశాను. ఇప్పుడు నేను దర్శకుణ్ని అయ్యి నాగార్జునతో సినిమా చేస్తున్నా. మీరు వెంటనే డైరెక్టర్గా రిటైరైపోండి అంటూ నోరుజారాడట పూరి... ఈ మాటకు ఆయన నవ్వి నా భుజం తట్టి వెళ్లిపోయారు. అప్పుడు నేనేమో నాగార్జునతో ఫ్లాప్ సినిమా చేశా. ఆయన ‘అన్నమయ్య’లాంటి బ్లాక్బాస్టర్ తీశారు. అప్పుడు నేను అన్న పిచ్చిమాటలకు సారీ సార్’’ అంటూ అప్పుడు జరిగిన తప్పిదానికి, ఈ కార్యక్రమంలో క్షమాపణలు చెప్పారు పూరి, దర్శకేంద్రుడికి...