ప్రతి వారం ఏదో ఒక మూమెంట్ తెలుగు చిత్ర పరిశ్రమలో  బెస్ట్ మిగిలిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. మరి ఈ వారం తెలుగు చిత్ర పరిశ్రమలో బెస్ట్ మూమెంట్ ఏంటి ఏంటి అంటే  నిశ్శబ్దం సినిమా. సైజ్  జీరో  తర్వాత పూర్తిగా లావెక్కి పోయిన అనుష్కకు ఆ తర్వాత అవకాశాలు తగ్గిన విషయం తెలిసిందే. ఇక బాహుబలి తర్వాత చాలా గ్యాప్ తీసుకొని భాగమతి అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది అనుష్క. ఇక మళ్లీ చాలా గ్యాప్ తీసుకుని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిశ్శబ్దం అనే సస్పెన్స్ త్రిల్లర్ సినిమాతో ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అనుష్క. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు  మంచి ఆదరణ పొందిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. 

 

 

 ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అనుష్క సినీ కెరీర్ ను బాగా బిల్డప్ చేసిన దర్శకులు అందరూ హాజరయ్యారు. అనుష్క గురించి ఎన్నో ప్రశంసలు కురిపించారు స్టార్ డైరెక్టర్లు. ముఖ్యంగా అనుష్క ని తెలుగు చిత్ర పరిశ్రమకు సూపర్ సినిమాతో పరిచయం చేసిన పూరి జగన్నాథ్ అనుష్కపై ప్రశంసలు కురిపించారు. అనుష్క బంగారం అని... ఎంతో మంచి అమ్మాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అనుష్క యోగా టీచర్ గా ఉంటే తను సినిమాల్లో నటింపచేసానని... ఆ తర్వాత అనుష్క కి క్రేజ్ ఎంతగానో పెరిగిపోయింది అంటూ పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన రాజమౌళి కూడా అనుష్క పై ప్రశంసల వర్షం కురిపించాడు. 

 

 

 అనుష్క తన ఫ్యామిలీ ఫ్రెండ్ అని... ఎన్నో ఏళ్ల నుంచి అనుష్క తనతో ఎంతో క్లోజ్ గా ఉంటుంది అంటూ రాజమౌళి తెలిపారు. ఈ సందర్భంగా అనుష్క తో తనకు ఎదురైన అనుభవాలను కూడా అభిమానులతో పంచుకున్నారు. విక్రమార్కుడు సినిమా సమయంలో అనుష్క నేను ఏది చెబితే అదే చేసేదని... ఏదైనా సీన్ చేయమంటే ఒకసారి చేసి చూపించండి అని అడిగేది అంటూ రాజమౌళి తెలిపారు. ఈ సందర్భంగా అనుష్క కారణంగా హీరోతో రొమాన్స్ చేయాల్సి వచ్చింది అంటూ రాజమౌళి తెలిపారు. ఇక అనుష్క తనకే కాదు తన ఫ్యామిలీ లో అందరితో చాలా క్లోజ్ గా ఉంటుందని... అనుష్క  మంచి నటితో పాటు ఎంతో  మంచి మనిషి అని ప్రశంసలు కురిపించారు రాజమౌళి.

మరింత సమాచారం తెలుసుకోండి: