అక్కినేని వారసుడిగా వెండితెర అరంగేట్రం చేసిన నాగచైతన్య.. లవర్ బాయ్గా సూపర్ హిట్లు సాధించాడు. అయితే చైతూ యాక్షన్ హీరోగా మాత్రం ప్రతీ సారి ఫెయిల్ అయ్యాడు. అయినప్పిటికీ అదే జానర్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు చైతూ. ఈ నేపథ్యంలోనే ‘ప్రేమమ్’ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరో వినూత్న కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘సవ్యసాచి’. ఈ చిత్రంలో చైతూకి అక్కగా సీనియర్ హీరోయిన్ భూమిక కీలకపాత్ర పోషించగా నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది.
ఇక ఈ చిత్రంలో హీరో మాధవన్ విలన్గా నటించి ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకున్నాడు. సినిమా ప్రధానంగా నాగచైతన్య, మాధవన్ల చుట్టూనే తిరుగుతుంది. ఇద్దరు తమ పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయారు. తొలిసారిగా స్ట్రయిట్ తెలుగు సినిమా చేసిన మాధవన్ కు ఇది మంచి లాంచ్ అనే చెప్పాలి. తాను ఎలాంటి పాత్రనైనా పండించగలనని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు మాధవన్. సైకో విలన్గా మాధవన్ నటన, పలికించిన హావ భావాలు సినిమాకు ప్లస్ అయ్యాయి. మరియు ఈ చిత్రంలో చైతూను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగిస్తాడు.
అంతేకాకుండా, హీరో, విలన్ మధ్య ఎత్తులు పై ఎత్తులను ఓ పక్క ఆసక్తికరంగా ముందుకు నడిపిస్తూనే మరో పక్క ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకుడిని ఆకట్టుకునే అంశాలతో కథ సాగుతుంది. అయితే సినిమాకు ఆయువుపట్టుగా మారాల్సిన క్లైమాక్స్ను రొటీన్ ఫైట్తో ముగించాడు. చివరకు ఎన్నో అంచనాల మథ్య ఈ చిత్రం క్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది. అయినప్పటికీ ‘సవ్యసాచి’ మూవీలో విలన్గా మాధవన్ నటనకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
కాగా, ప్రస్తుతం మాధవన్.. అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫస్ట్ సౌత్ హాలీవుడ్ క్రాస్ఓవర్ ఫిలిం.. ‘నిశ్శబ్దం’ చిత్రంలో నటిస్తున్నారు. మ్యాడీ ఈ సినిమాలో ‘ఆంథొనీ’ అనే సెలెబ్రిటీ మ్యుజిషియన్గా కనిపించనున్నాడు. తెలుగులో ‘నిశ్శబ్దం’, మిగతా భాషల్లో ‘సైలెన్స్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా కథ అమెరికాలోని సియోటల్ బ్యాక్ డ్రాప్లో సాగుతుంది.