టాలీవుడ్ లో ఒక్కసారిగా పాపులర్ అయిన పూరి ఇస్మార్ట్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, నభా నటేష్. ఈ ఇద్దరు అంతక ముందు సినిమాలు చేశారు. కాని అవి ఏమాత్రం ఉపయోగపడలేదు. నిధి అగర్వాల్ అక్కినేని బ్రదర్స్ ఇద్దరి తోను బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. నాగ చైతన్య తో సవ్యసాచి, అఖిల్ తో మిస్టర్ మజ్ఞు సినిమాలు చేసింది. కానీ ఆ రెండు సినిమాలు ఫ్లాపయ్యాయి. దాంతో నిధి ఇక టాలీవుడ్ లో సర్ధుకోవాల్సిందేనని అనుకున్నారు. అలాగే నభా నటేష్ కూడా నన్ను దోచుకుందువటే సినిమాలో నటించింది. ఆ సినిమా నభా కి మంచి పేరు తెచ్చిపెట్టింది గాని అవకాశాలు మాత్రం రాలేదు. 

 

ఇక నభా కూడా టాలీవుడ్ మీద ఆశలు వదులుకుంది. కానీ అనూహ్యంగా పూరి జగన్నాధ్ ఇద్దరికి ఇచ్చిన షాక్ కి తేరుకోవడానికి కాస్త సమయం పట్టింది. ఈ ఇద్దరిని ఇస్మార్ట్ శంకర్ లో హీరోయిన్స్ గా సెలెక్ట్ చేసుకొని గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు. తట్టా బుట్టా సర్దుకొని వెళ్ళే సమయంలో పూరి వీళ్ళ పాలిట దేవుడయ్యాడు. ఆయన జగన్నాథ్ డైరెక్షన్లో రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో నటించి నిధి అగర్వాల్, నభా నటేష్ తన ఖాతాలో మంచి కమర్షియల్ హిట్ ని వేసుకున్నారు. 

 

పూరి హీరోయిన్స్ ని బాగా వాడతాడన్న విషయం అందరికి తెలిసిందే. అలాగే ఈ సినిమాలో ఈ ఇద్దరి దగ్గరున్న టాలెంట్ ని బయటకి తీశాడు. అప్పటి వరకు లేని క్రేజ్ ని ఈ ఇద్దరి హీరోయిన్స్ కి పూరి ఇచ్చాడనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే 'ఇస్మార్ట్ శంకర్' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించినప్పటికి తెలుగులో మాత్రం ఈ ఇద్దరికి చెప్పుకునేంత క్రేజీ ప్రాజెక్ట్స్ లో అవకాశాలు మాత్రం రావడం లేదని వాపోతున్నారు. తెలుగులో మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లాతో చేస్తున్న సినిమాలో నిధి నటిస్తుంది. అలాగే నభా డిస్కో రాజా సినిమాలో నటించింది. ఆ సినిమా దారుణంగా ఫ్లాపయింది. దాంతో నభా ప్రస్తుతం ఖాళీగా ఉంది. అలాగే నిధి పరిస్థితి కూడా మరెందుకు వీళ్ళకి ఆఫర్స్ రావడం లేదో తెలీడం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: