టాలీవుడ్ లోకి లక్ష్మీ కళ్యానం మూవీతో హీరోయిన్ గా పరిచయం అయిన కాజల్ తర్వాత స్టార్ హీరోల సరసన ఛాన్సులు దక్కించుకొని తెలుగు, తమిళ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా వెలిగిపోయింది. టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీతో నటించిన కాజల్ ఇప్పుడు మరోసారి కొరటాల-చిరంజీవి కాంబోలో వస్తున్న ‘ఆచార్య’ మూవీలో నటించేందుకు సిద్దమైన విషయం తెలిసిందే. ఇప్పటికే వివివినాయక్ దర్శకత్వంలో చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత మరోసారి చిరంజీవితో జత కట్టేందుకు సిద్దమైంది ఈ బ్యూటీ. మొదట త్రిష అనుకున్నప్పటికీ రెమ్యూనరేషన్ విషయంలో తేడా వచ్చినట్లు.. ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తెరపైకి కాజల్, అనుష్క పేర్లు వినిపించాయి. గతంలో కొరటాలతో ఉన్న స్నేహ సంబంధంతో ఆమె చిరుతో నటించేందుకు సిద్దమైనట్లు వార్తలు వచ్చాయి.
మరోవైపు చిరుతో నటించేందుకు కాజల్ సిద్దమైనప్పటికీ కొత్త డిమాండ్ తెరపైకి తీసుకు వచ్చిందట. పెద్ద బ్యానర్ స్టార్ హీరో సరసన నటించడం అంటే మంచి ఛాన్స్ ఇదే సమయంలో రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఎలాంటి కాంప్రమైజ్ కారు. ఈ నేపథ్యంలోనే కాజల్ కూడా తన రెమ్యూనరేషన్ విషయంలో బాగానే డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే చిరుతో మరోసారి నటించానికి ఈ అమ్మడు పారితోషికంగా రెండున్నర కోట్లు అడిగిందట. చివరికి ఒకటిన్నర కోటికి చేయడానికి ఆమె అంగీకరించినట్టు సమాచారం.
త్వరలోనే ఆమె షూటింగులో పాల్గొననున్నట్టు చెబుతున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఈ జంట మరోసారి తెరపై చూసేందుకు మెగా అభిమానులు కూడా సంతోషంలో ఉన్నారు. మరోసారి అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ అనే సాంగ్ మరోకటి ఉంటుందేమో అని ఎదురు చూస్తున్నారు. దేవాలయాల మాఫియాపై తెరకెక్కుతున్న ఈ మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ కూాడా ఉండబోతున్నాయట.