ఖతర్నాక్ అందాలతో బుల్లితెరపై కాకరేపే యాంకర్ రష్మి గౌతమ్.. గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్రతి వారం ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటూ హాట్ హాట్ అందాలతో ఆ షోకి అదనపు ఆకర్షణగా నిలుస్తున్న రష్మికి ఫ్యాన్ ఫాలోంగ్ కూడా ఎక్కువే. అంతేకాకుండా, ఈ ముద్దుగుమ్మ  సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. సామాజిక అంశాలపై స్పందించడంతో పాటు.. మూగ జీవాల రక్షణపై ఆమె ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. అయితే తప్పు ఎప్పుడూ చేయాల్సిన అవసరం లేదు.. ఒక్కసారి చేసి దొరికినా చాలు. ఇప్పుడు రష్మి గౌతమ్ కూడా ఇలాంటి తప్పే చేసింది. ఓ వైపు కరోనా వైరస్.. దేశవిదేశాలకు కునుకులేకుండా చేస్తోంది. శర వేగంగా విస్తరిస్తోన్న కరోనాను కట్టడి చేయలేక చేతులెత్తేస్తున్నారు.

 

ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా మృతిచెందిన వారి సంఖ్య 11 వేలు దాటేసింది. కరోనా దెబ్బకు ప్రపంచం అబ్బా అంటోంది. దాన్ని నియంత్రించటానికి ఆయా దేశాలు హెల్త్ ఎమర్జన్సీన ప్రకటిస్తున్నాయి అంటే కరోనా తీవ్రత ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. అయితే ఇలాంటి టైమ్‌లో రష్మి ఓ పిచ్చి ప‌ని చేయ‌డంతో ఇప్పుడు నెటిజ‌న్ల చేత చివాట్లు తింటుంది. తాజాగా రష్మీ రాజమండ్రిలో ఒక షాపింగ్‌మాల్‌ ఓపెనింగ్‌కు వెళ్లింది. కరోనా శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో షాపింగ్‌ మాల్స్‌ వంటివి బంద్‌ చేయాలంటూ ప్రభుత్వాలు పిలుపునిస్తుంటే ర‌ష్మి మాత్రం అక్క‌డ‌కు వెళ్ల‌డ‌మే కాకుండా..  నేను రాజమండ్రి వస్తున్నాను. 

 

మీరు ఆ మాల్‌ వద్దకు రమ్మంటూ పోస్ట్‌ పెట్టింది. దీంతో వేలాది మంది అక్కడకు చేరుకున్నారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని అందరిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఈ విష‌యంపై ర‌ష్మికు నెటిజ‌న్లు గ‌ట్టిగానే క్లాస్ పీకారు. దీంతో కరోనా కారణంగా ఎవరు రాకపోవచ్చు అనుకున్నాను. ఓపెనింగ్స్‌కు అంత మంది వస్తారని తాను గెస్‌ చేయలేదు అంటూ క్షమాపణ చెప్పింది ర‌ష్మి. అయిన‌ప్ప‌టికీ కూడా రష్మి ప్ర‌స్తుతం నెటిజ‌న్ల చేత‌ తిట్లు తింటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: