ఈ మద్య రిమేక్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత పెరిగిపోతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో సందీప్ వంగా దర్శకత్వంలో ‘అర్జున్ రెడ్డి’ రిమేక్ గా బాలీవుడ్ లో సందీప్ వంగా దర్శకత్వంలో షాహిద్ కపూర్, కైరా అద్వానీ జంటగా ‘కబీర్ సింగ్’ గా తెరకెక్కించారు.  తెలుగు లో ఎంత గొప్పగా హిట్ అయ్యిందో బాలీవుడ్ లో సైతం అదే రేంజ్ లో హిట్ అయ్యింది. ఇలా తెలుగు లో హిట్ అయిన సినిమాలు బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్నారు.  గత ఏడాది నాని నటించిన ‘జెర్సీ’ మూవీ కూడా అక్కడ రిమేక్ చేస్తున్నారు.  ఈ మూవీలో కూడా షాహిద్ కపూర్ నటిస్తున్నాడు.  తాజాగా ఇటీవల నితిన్, రష్మక జంటగా నటించిన వెంకి కుడుముల దర్శకత్వంలో వచ్చిన ‘భీష్మ’ మూవీ రిమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట.

 

రణ్ బీర్ కపూర్ హీరోగా ఆయన ఈ సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నాడని చెబుతున్నారు. ఇప్పటికే  పాన్ ఇండియా మూవీగా ‘ఆర్ఆర్ఆర్’,  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘ఫైటర్’ మూవీలు కూడా బాలీవుడ్ లో సందడి చేయబోతున్నాయి. మరోవైపు విజయ్ దేవరకొండ, రష్మిక నటించిన ‘డీయర్ కామ్రేడ్’  రీమేక్ రైట్స్ కూడా కరణ్ జొహార్ దగ్గరే వున్న సంగతి తెలిసిందే.  

 

ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆదరించడంతో, నితిన్ కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. దాంతో ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసే ఆలోచనలో కరణ్ జోహర్ వున్నాడని సమాచారం. రణ్ బీర్ కపూర్ హీరోగా ఆయన ఈ సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నాడని చెబుతున్నారు.  చాలా కాలం తర్వాత నితిన్ కి ‘భీష్మ’ తో మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. రైతులకు సంబంధించిన కథ కావడంతో ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది.  సేంద్రీయ ఎరువులపై ఈ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: