రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్ క్రేజ్ హీరోయిన్ అని చెప్పాలి. ఈ భామ గీతగోవిందం చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవలె మహేష్తో కలిసి సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించి సూపర్డూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత వచ్చిన భీష్మ కూడా మంచి హిట్ అయిందనే చెప్పాలి. అయితే ఇటీవలె ఈ భామ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఆమెకు ఎదురైన ఓ ప్రశ్నకు సమాధానం వేలు చూపించి మరీ వార్నింగ్ ఇస్తూ చాలా గట్టిగా చెప్పింది. అదేంటబ్బా ఏమయింది అనుకుంటున్నారా. అంతలా హర్ట్ అయ్యే విషయం ఏమడిగారు అనుకుంటున్నారా. ఇంకేముందండి ప్రత్యేకించి నన్ను ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక్కటే ఆమెను వెంటాడే మాట అదేనండి ఆమె ప్రేమించి మరీ నిశ్చితార్దం చేసుకున్న కన్నడ స్టార్ రక్షిత్ శెట్టితో జరిగిన బ్రేకప్ గురించి ఆమెను పదే పదే అడిగి విసుగు తెప్పిస్తున్నారు.
అంత ఈజీగా ఎవ్వరూ బ్రేకప్ చేసుకోరు కదా అని అడుగుతున్నారు. మరోసారి తన దగ్గర ఆ ప్రశ్న రాకూడదని గట్టిగా వార్నింగ్ ఇచ్చిందట. ఇక ఈమె బ్రేకప్ చేసుకోవడానికి ప్రధాన కారణం ఆమె అప్పుడప్పుడే సినిమాల్లో మంచి రేంజ్కి ఎదుగుతుంది. అందులోనూ అప్పుడూ గీతగోవిందంతో ఒక్కసారిగా స్టార్స్టేటస్ని సంపాదించిన ఈ భామ సడెన్గా పెళ్ళంటే కెరియర్ ఏమయిపోతదని ఆలోచించిందట. అంతేకాక తను స్టార్ హోదాలో ఉన్నప్పుడు రక్షిత్ తనకంటే కాస్త తక్కువ ఇమేజ్ వాడు అయిపోతాడని అందుకే రక్షిత్తో బ్రేకప్ చేసుకున్నట్లు ఇండస్ట్రీ నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.
హీరోయిన్లు ఎవరైనా సరే అంతేకదా ఒక స్టేటస్ వచ్చేవరకు కాస్త తగ్గిఉంటారు. ఒన్స్ మంచి స్టేటస్ వచ్చాక వారి రేంజ్ మారిపోతుంది. టేస్టులు కూడా మారిపోతాయి. దాంతో పెళ్ళి చేసుకున్నాక విడిపోవడం ఎందుకు ముందే డ్రాప్ అవ్వడం బెటర్ అనుకుందో ఏమోగాని ఈ భామ మాత్రం ముందుగానే డ్రాప్ అయింది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో బన్నీతో కలిసి ఓ మాస్ క్యారెక్టర్లో కనిపించబోతుంది ఈ భామ. ఆ తర్వాత రామ్చరణ్తో కూడా మరో చిత్రంలో నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.