నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో ఓ సినిమా పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత వీరిద్దరు చేస్తున్న మూడో సినిమా ఇది. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథ లీక్ మొత్తం నవగ్రహాలు.. అవి మనుషులపై చూపించే ప్రభావం అనే లైన్తో తెరకెక్కబోతుందట. ఇందులో భాగంగానే బాలయ్య.. వారణాసిలో కనిపించే అఘోరాగా నటిస్తున్నాడని తెలుస్తోంది.
అయితే హిట్లు.. ఫ్లాపులతో సంబంధం లేకుండా వరస సినిమాలు చేస్తుకుంటూ పోతున్న బాలయ్య.. ఆయన తనయుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ ఇవ్వడం లేదు. ఈయన డెబ్యూ సినిమా గురించి చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి సమచారం అయితే రాలేదు. మరోవైపు నందమూరి అభిమానులు బాలకృష్ణ వారసుడి ఎంట్రీ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. ఇదిలా ఉంటే.. బాలకృష్ణ, మోక్షజ్ఞతో మల్టీస్టారర్ చేస్తానంటున్నారు టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.
అసల ఏంటీ ఈయన కథ అన్నది ఇప్పుడు చూద్దాం. తాజాగా తరుణ్ భాస్కర్ హోస్ట్ గా చేస్తున్న 'నీకు మాత్రమే చెప్తా' అనే షోలో పాల్గొన్న అనిల్ రావిపూడి కొన్ని ఆసక్తికర విషయాలు బయట పెట్టారు. ఇందులో భాగంగా మోక్షజ్ఞను ఎప్పటికైనా డైరెక్ట్ చేస్తానని అనిల్ రావిపూడి తెలిపారు. కుదిరితే బాలకృష్ణతో కూడా సినిమా చేసేందుకు సిద్ధమేనని పేర్కొన్నాడు. అంతేకాదు.. అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న సమయంలో బాలకృష్ణ మోక్షజ్ఞతో కలిసి ఉన్న ఫోటో ఆయన రూమ్లో ఉండేదని.. ఒకవేళ తాను డైరెక్టర్ అయితే వీరిద్దరి తో కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తానని అప్పట్లో అనే వాడినని అనిల్ రావిపూడి వెల్లడించాడు.
మరి అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ, మోక్షజ్ఞతో మల్టీస్టారర్ వస్తే అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. కాగా, ప్రస్తుతం అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరూ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఫుల్ జోష్లో ఉన్నారు. అలాగే మరోవైపు ఈయన ఎఫ్-2 కి సీక్వెల్ ఎఫ్-3 సినిమా చేసే పనిలో బిజీగా ఉన్నట్టుగా సమాచారం.