ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌మంతా వ‌ణికిస్తున్న వ్యాధి క‌రోనా ఈ వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. జ‌నం ఎప్పుడూ ఎన్న‌డూ ఊహించ‌ని విధంగా విప‌త్క‌ర ప‌రిస్థితి ఇది. చైనాలోని పుహాన్ గ్రామంలో జ‌రిగిన ఈ త‌ప్పిదం వ‌ల్లే ఒక్క‌సారిగా భ‌యోందాళ‌మైన వాతావ‌ర‌ణంలోకి నెట్టేసింది. ప్ర‌స్తుత ప‌రిస్థితి నుంచి ప్ర‌పంచం త‌ప్పించుకోవాలంటే ఒక్క‌టేమార్గం వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్ట‌డ‌మే. దీని కోసం కేంద్ర ప్ర‌భుత్వం న‌డుం బిగించింది. లాక్ డౌన్ ప్ర‌క‌టించింది. మ‌రి దీనికి మ‌ద్ధ‌తుగా ఎంతోమంది సెల‌బ్రెటీలు సైతం నిల‌బ‌డుతున్నారు. 

 

ఇక ఈ వైర‌స్ గురించి రెండు  రాష్ట్రాల్లోని ప్ర‌జ‌లు కూడా పాటించాల‌ని సూచించింది. అంతేకాక ప్ర‌భుత్వం కూడా చాలా జాగ్ర‌త్త‌తో నిబంధ‌నులు అన్నీ కూడా పాటిస్తోంది.  ఎందుకంటే బ‌య‌టికి క‌నిపించ‌ని సూక్ష్మ క్రిమితో పోరాటం కాబ‌ట్టి దీన్ని తేలిగ్గా తీసుకోవ‌ద్ద‌ని, తేలిగ్గా తీసుకుంటే ఇటలీలో ప‌రిస్థితి త‌లెత్తే ప్ర‌మాదం వుంద‌ని హెచ్చ‌రిక‌లు జారి చేస్తున్నారు. ఈ నెల 31 వ‌ర‌కు ప్ర‌తీ రోజు రాత్రి 7 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూని విధించారు. క‌రోనా పై ఉభ‌య తెలుగు రాష్ట్రాలు నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేస్తుండ‌టం అభినంద‌నీయ‌మ‌ని భావించిన హీరో నితిన్ త‌న వంతు స‌హాయంగా క‌రోనా క‌ట్టడి కోసం ఉభ‌య తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రుల స‌హాయ నిధికి 20 ల‌క్ష‌లు ఆర్థిక స‌హాయాన్ని ప్ర‌క‌టించాడు.

 

ప్ర‌పంచ విళ‌యాన్ని త‌ల‌పిస్తున్న ఈ సంద‌ర్భంలో అంతా ముందుకు రావాల‌ని నితిన్ ఇన్‌డైరెక్ట్‌గా చెప్ప‌క‌నే చెప్పాడు. ఇక ఈ నినాదాన్ని ఎంత మంది హీరోలు పాటించి ముందుకొస్తారో చూడాలి. చిన్ని హీరోలైనా ముందుగా ఎంతో బాధ్య‌తారాహిత్యంగా వ‌హిస్తున్నారు. ఇక మ‌రికొంత మంది సోష‌ల్ మీడియాలో ఈ విష‌యం పై కొంత మంది నితిన్‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ మ‌రోవైపు మిగ‌తా హీరోల బాధ్య‌త‌ను ఎంత వ‌ర‌కు నిర్వర్తిస్తారో చూద్దాం అంటున్నారు. ఇకపోతే ఇలాంటి వాటి పై ఒక‌రు గుర్తు చేస్తే రాకూడ‌దు. ఎవ‌రికి వారికి ఆలోచ‌న ఉండాలి. ఎదుటివారికి స‌హాయం చెయ్యాల‌న్న ఆలోచ‌న అన్న‌ది ప్ర‌తి ఒక్క‌రికి రావాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: