ప్రపపంచ వ్యాప్తంగా గడగడలాడిస్తున్న కరోనా ఎవ్వరినీ ఒదిలిపెట్టడం లేదు. ప్రతి ఒక్కరో ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఏదో ఒక రూపంలో వచ్చి అంటుతుంది. ఇంట్లో ఒక్కరికి వచ్చినా సరే మొత్తం అందరికి వస్తుంది. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంట్లో ఎవరైనా ఒకరికి కరోనా ఉంటే వారు ఏకంగా ఇంటి నుంచే వెళిపోతున్నారు. అది తల్లైనా బిడ్డైనా ఎవ్వరినైనా సరే దూరం చేస్తుంది. ఇంత ప్రాణాంతక వ్యాధి రావడంతో ప్రతి ఒక్కరూ భయాందోళనతో కన్నీరు మున్నీరవుతున్నారు. ఏమి చెయ్యాలో కూడా అర్ధం కాని పరిస్థితులు వస్తున్నాయి. సామాన్యుల పరిస్థితి ఇలా ఉంటే వ్యాధి సోకిన వారిని పరీక్షించి వైద్యం అందించే డాక్టర్లను సైతం ఈ వ్యాధి వదలడం లేదు. ఇలాంటి ఉదారత మైన ఘటన ఒకటి ఇండోనేషియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...
ఈ నిస్సహాయ కళ్ళు తేమగా ఉన్నాయి. చనిపోయే ముందు ఇంటికి వచ్చి, గేట్ వెలుపల నుండి పిల్లలను చూసి వెళ్లిపోయాడు, తరువాత అతను ప్రపంచానికి వీడ్కోలు చెప్పాడు. చివరిగా కన్నబిడ్డలను దగ్గరికి తీసుకునే పరిస్థితి కూడా అతనికి లేకపోయింది. అతను తన పిల్లలను తాకలేకపోయాడు. ఇండోనేషియాకు చెందిన డాక్టర్ హైడియో అలీ యొక్క చివరి చిత్రం ఇది, కరోనా వైరస్ రోగులకు చికిత్స చేస్తున్నప్పుడు కరోనా సోకింది.
అది తెలుసుకున్న అతను వెంటనే ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. బయటనే ఉంటూ అందరికి దూరంగా తనకు తాను స్వియ నిర్బంధంలో ఉండిపోయాడు. ఇక తాను చనిపోతాను అని అర్దమయినప్పుడు చివరగా పిల్లలను చూడాలనుకున్నాడు. తాను ఇకపై రక్షింపబడనని భావించిన ప్పుడు, అతను ఇంటికి వెళ్లి గేటు వెలుపల నిలబడి, తన పిల్లలను మరియు గర్భిణీ భార్యను చివరిసారిగా చూస్తూ, ఆ పై వెళ్లిపోయాడు, ఈ చిత్రాన్ని అతని భార్య తీసింది. అతను తన పిల్లలను హృదయపూర్వకంగా చూడటానికి మరియు వారి వీడ్కోలు తీసుకోవడానికి వచ్చినప్పుడు, అతను చాలా దూరంగా నిలబడ్డాడు, ఆఖరికి తన బీబీకి పిల్లలకు వైరస్ రావాలని అతను కోరుకోలేదు. డాక్టర్ హైడియో అలీ మానవుడిగా దేవదూత అని నిరూపించాడు, అలాంటి వైద్యుడికి వందనం అని సోషల్ మీడియాలో అతనికి చాలా మంది కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
https://tinyurl.com/NIHWNgoogle