బుల్లితెర పాపుల‌ర్ యాంక‌ర్ ఓంకార్ అంటే గుర్తుప‌ట్టని టీవి ప్రేక్షకులు ఉండ‌రు. అలాగే టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోనూ ఓంకార్ చేస్తున్న యాంక‌ర్ స్టైల్‌ను పేర‌డీగా ఫుల్ కామెడీ చేస్తుంటారు. ఇదిలా ఉండే ఇప్పుడు మ‌హేష్‌బాబు న‌టిస్తున్న అప్‌క‌మింగ్ ఫిల్మ్ ఆగ‌డు మూవీలో ఓంకార్‌పై మ‌హేష్ సైటైర్ల వ‌ర్షం కురిపిస్తాడంట‌. శ్రీనువైట్ల డైరెక్ట్ చేస్తున్న ఆగడు మూవీలో ఈసారి ఓంకార్ యంక‌రింగ్ స్టైల్‌ను కామెడీ పార్ట్‌గా తీసుకున్నాడు. టాలీవుడ్‌లో వినిపిస్తున్న దీనికి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ స‌మాచారాన్ని ఎపిహెరాల్డ్‌.కామ్ మీకు అందిస్తుంది. శ్రీనువైట్ల తీస్తున్న మూవీలో కామెడీ అనేది మూవీ స‌క్సెస్‌లో ప్రధాన భాగంగా క‌నిపిస్తుంది. ఆ విధంగానే శ్రీనువైట్ల తీస్తున్న మూవీల‌కు ఆ విధ‌మైన‌ బ్రాండ్ ప‌డిపోయింది. సిని ప్రేక్షకుడు సైతం శ్రీనువైట్ల మూవీల‌ను న‌వ్వకోవ‌టానికి థియోట‌ర్లకు వ‌స్తుంటారు. ఇదిలా ఉంటే దూకుడు మూవీకు సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న ఆగడు మూవీలో కామెడీ పార్ట్ అంతా ఓంకార్ యాంక‌రింగ్ చుట్టు తిరుగుతుంది. దూకుడు మూవీలోనూ రియాలిటి షో అంటూ తీసిన కామెడీ సీక్వెన్స్ అంద‌ర్నీ క‌డుపుబ్బా న‌వ్వించింది. అలాగే ఇప్పుడు ఆగ‌డు మూవీలో ఓంకార్ మీద మ‌హేష్ చేత పంచ్‌ల మీద పంచ్‌లు వేయించాడ‌ట‌. మూవీలో ఇది హైలెట్ కామెడీ సీక్వెన్స్‌గా ఉంటుంద‌ని చిత్ర యూనిట్ చెబుతుంది. త‌మ‌న్నా మొద‌టిసారిగా ఈ మూవీలో ప్రిన్స్ స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీకు సంబంధించిన షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: