చైనాలోని వుహాన్ నగర సరిహద్దుల్లో ఉన్న జంతువుల మార్కెట్ లో కరోనా పుట్టిదని చెప్పుకొస్తున్న ఈ వైరస్ వల్ల ప్రస్తుతం ప్రపంచం మొత్తం వణికిస్తుంది. ఎన్నో ప్రణాలు పోతున్నాయి. ప్రపంచ దేశాలన్నిటికి అత్యంత వేగంగా వ్యాపించి రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. అంతేకాదు ఊహించని విధంగా జనాల ప్రాణాలు పోతున్నాయి. దాంతో ఇండియా తో పాటు మిగతా దేశాలన్నీ కరోనా నుండి తమని తాము కాపాడుకోవడానికి లాక్ డౌన్ ని విధించాయి. ఇంతవరకు వ్యాక్సిన్ కనుక్కోలేని ఈ వైరస్ ప్రపంచాల్ని అన్ని రకాలుగా నాశనం చేసేసింది. అయితే ఇదంతా చైనా నిర్లక్ష్యం వల్లే జరిగిందని కొందరు..లేదు కావాలనే ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీయాలనే చైనా ఇలా చేసిందంటూ వార్తలు వస్తున్నాయి.

 

కరోనా వైరస్ మనుషుల నుండి మనుషులకి వ్యాపిస్తుందని తెలిసి కూడా ప్రపంచానికి తెలియకుండా చైనా దాచేసిందని.. అదీ గాక ఆ విషయం తెలిసి కూడా ప్రపంచ దేశాలకి చైనా నుండి ఏడు మిలియన్ల మందిని పంపించారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది చైనా ని విపరీతంగా తిట్టి పోస్తున్న సంగతి తెలిసిందే. జంతువులని తినే అలవాట్లున్న వారిని తిడుతున్నారు. ఇలా తిడుతున్నవాళ్ళలో బాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా మొదలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

 

సాథియా సినిమాలో నటించిన సంధ్యా మ్రిదుల్ చైనా వాళ్ళని ఏకిపారేసింది. జంతువులనే కాదు మిమ్మల్ని మీరే తినండంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆవిడ ఒక్కరే కాదు ఇలా చైనాని తిట్టేవారు చాలా మంది ఉన్నారు. అన్నిదేశాల్లో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో చైనాలోని వుహాన్ నగరంలో మాత్రం లాక్ డౌన్ ని ఎత్తివేస్తే ఇలానే అందరూ తిడతారని అంటున్నారు. అంతేకాదు సంధ్యా మ్రిదుల్ వ్యాఖ్యలని సమర్ధిస్తూ సపోర్ట్ చేస్తున్నారు.  ఇక ఇప్పటికే చాలా వరకు లాక్ డౌన్ తో కంట్లోకి వస్తుందని చెబుతున్నా కూడా ప్రజల్లో మాత్రం భయం పోవడం లేదు. అందుకు కారణం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి జరిగే అనర్ధాలు జరుగుతూనే ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: