ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా తో మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోయింది. పెద్ద పెద్ద ఇండస్ట్రీలన్ని కుదేలయిపోయాయి. అందులో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ కూడా. 2020 లో ఒక్కో హీరో ఒక్కో రకంగా ప్లాన్స్ వేసుకున్నారు. 2019 కంటే గొప్ప సక్సస్ లను చూడాలని భారీ హిట్స్ తమ ఖాతాలో వేసుకోవాలని స్టార్ హీరోలందరు ప్లాన్స్ చేసుకున్నారు. స్టార్ హీరోలు మాత్రమే కాదు యంగ్ హీరోలు కూడా గత ఏడాది సక్సస్ లు అందుకోలేకపోవడం తో ఈ ఇయర్ కనీసం రెండు హిట్స్ అందుకోవాలన్నది మన టాలీవుడ్ హీరోల ప్రయత్నాలు. అయితే కరోనా దెబ్బకి అవన్ని తారుమారు అయ్యాయి.

 

నితిన్ ఇప్పటికే భీష్మ తో సక్సస్ ని అందుకున్నాడు. తర్వాత రంగ్ దే సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. కానీ షూటింగ్ స్టేజ్ లోనే అది ఆగిపోయింది. దాంతో తన నెక్స్ట్ సినిమాలు గాడి తపాయి. అంతేకాదు నేచిరల్ స్టార్ నాని, నిఖిల్, ప్రభాస్, బన్నీ, రామ్ చరణ్.. ఇలా అందరి సినిమాలు ఆగిపోయాయి. వీటిలో ఎన్ని సినిమాలు ఈ సంవత్సరం షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి వస్తాయో క్లారిటి రావాలంటే ఇప్పుడప్పుడే కష్టం అని అంటున్నారు.

 

నిఖిల్ కూడా అర్జున్ సురవరం తర్వాత కార్తికేయ-2, 18 పేజెస్ సినిమాలను ప్రారంభించాడు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక్క సినిమా కంప్లీటయితే గ్రేట్ అని సమాచారం. ఇక కరోనా తో మెగాస్టార్ చిరంజీవి కూడా ఆచార్య సినిమాను వంద రోజుల్లో పూర్తిచేయాలనుకున్నప్పటికి అది ఇప్పుడు సాధ్యపడేలా కనిపించడం లేదు.

 

చరణ్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఆగిపోయింది... నిర్మాతగా తీస్తున్న ఆచార్య ఆగిపోయింది. దాంతో చరన్ ఫ్యూచర్ ప్లానింగ్స్ మొత్తం మారిపోయాయి. ఇక ప్రభాస్, అల్లు అర్జున్ లు అనుకున్న ప్లాన్స్ కూడా దెబ్బైపోయాయి. వీళ్లతో పాటు బాలకృష్ణ-బోయపాటి సినిమా, వెంకటేశ్-నారప్ప, నాగార్జున-వైల్డ్ డాగ్ సినిమాల షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. 
క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple
     

మరింత సమాచారం తెలుసుకోండి: