టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ బిగినింగ్ లో నటించిన ‘టక్కరిదొంగ’ సినిమా గుర్తుంది కదా. ఒకప్పుడు హాలీవుడ్ లో కౌబాయ్ సినిమాలకు యమా క్రేజ్ ఉండేది. ఆ తర్వాత బాలీవుడ్, టాలీవుడ్ లో కూడా ఈ తరహా సినిమాలు వచ్చాయి. అయితే ఎక్కువగా కౌబాయ్ సినిమాల్లో సూపర్ స్టార్ కృష్ణ నటించారు. చాలా కాలం తర్వాత మెగాస్టార్ కొదమ సింహం సినిమాలో కౌబాయ్ గా కనిపించారు. ఆ తర్వాత మహేష్ బాబు ‘టక్కరిదొంగ’ మూవీలో కౌబాయ్ గా కనిపించారు. ఈ మూవీలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ అందాలభామ లీసా రే నటించింది. ఆ తర్వాత ఆమె తెలుగు లో కనిపించలేదు.
అయితే లీసా రే క్యాన్సర్ బారినపడినా మొక్కవోని ధైర్యంతో పోరాడి ఆరోగ్యవంతురాలైంది. తాజాగా కరీనా కపూర్ నిర్వహించే వాట్ ఉమెన్ వాంట్ అనే టాక్ షోలో లీసా రే తాను క్యాన్సర్ సమయంలో పడ్డ ఆవేదన.. నరకం గురించి తెలిపింది. పెళ్లయిన నెలకే క్యాన్సర్ వ్యాధి తిరగబెట్టిందని, దాంతో నరకం చవిచూశానని తెలిపింది. పెళ్లైన ఆనందం కూడా లేకుండా ఈ క్యాన్సర్ తిరగబడటం.. ఈ విషయం నా భర్త జాసన్ డెహ్నీకి చెప్పలేకపోయాను.
వైవాహిక జీవితంతో సంతోషంగా ముందుకెళదాం, ఆ తర్వాత క్యాన్సర్ సంగతి చూసుకోవచ్చని భావించాను. కానీ పెళ్లయిన నెలకే తప్పని సరి పరిస్థితిలో మళ్లీ ట్రీట్ మెంట్ కు వెళ్లాల్సి వచ్చింది అని వెల్లడించింది. అయితే నాకు పెళ్లైన తర్వాత ప్రాణాంతకరమైన వ్యాధి క్యాన్సర్ వచ్చినా.. నా అందమైన భర్త ఎంతో ఆదరణ.. గుండె ధైర్యాన్ని నింపారని అందుకే అంతటి ఘోర విపత్కర పరిస్థితి నుంచి బయట పడ్డానని అన్నారు. నన్ను పెళ్లి చేసుకున్నందుకు థ్యాంక్స్ బేబీ అంటూ కృతజ్ఞతలు తెలిపాను. లీసా, జాసన్ డెహ్నీల వివాహం 2012లో జరిగింది. 2018లో వీరికి సూఫీ, సొలీల్ అనే కవలలు జన్మించారు.