టాలీవుడ్ దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సక్సెస్ఫుల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మంచి సామజిక అంశంతో పలు రకాల కమర్షియల్ హాగులతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక చాలా రోజుల గ్యాప్ తరువాత మెలోడీ బ్రహ్మ మణిశర్మ మెగాస్టార్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ ని జరుపుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో దేశంలో లాకౌట్ ప్రకటించడం వలన షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ అవడంతో దీన్ని కూడా కొన్నాళ్ళు వాయిదా వేశారు. 

IHG've done my <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=JOB' target='_blank' title='job-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>job</a> properly”, says ...

ఇకపోతే ఇటీవల మెగాస్టార్ తనయుడు, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ అధినేత రామ్ చరణ్, మోహన్ లాల్ నటించిన మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ సినిమా తెలుగు హక్కులు ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న ఆచార్య అనంతరం, ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా కొద్దిరోజులుగా ఈ సినిమాకి ఎవరు దర్శకత్వం వహిస్తారు అనే దానిపై పలు టాలీవుడ్ వర్గాల్లో చర్చలు జరుగుతుండడంతో పాటు, కొందరు దర్శకుల పేర్లు తెరమీదకు రావడం జరిగింది. 

 

అయితే నేడు కొందరు మెగాస్టార్ ఫ్యామిలీ సన్నిహితుల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, ఈ సినిమాకు యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించనున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే శర్వానంద్ తో రన్ రాజా రన్, అలానే ఇటీవల ప్రభాస్ తో సాహో సినిమాలు తీసిన సుజీత్ అయితేనే ఈ సినిమా కథకు న్యాయం చేయగలడని భావించి అతడిని ఎంపిక చేసారని, ఇక ఈ విషయమై ఇప్పటికే సుజీత్ ని సంప్రదించి ఒప్పించడం జరిగిందని, అతి త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు చెప్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం, ఇది సుజీత్ కు ఒక గొప్ప సదావకాశం అనే చెప్పాలి....!!   

మరింత సమాచారం తెలుసుకోండి: