యంగ్ హీరో నాగ శౌర్య ఊహలు గుసగుసలాడే సినిమా తో అదిరిపోయే విజయాన్ని టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నమోదు చేసుకోవడం జరిగింది. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నాగ శౌర్య కి మంచి పేరు తెచ్చిపెట్టింది. హీరో గా ఇండస్ట్రీలో ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా నిలదొక్కుకున్నాడు. వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్న నాగశౌర్య ఇటీవల అశ్వద్ధామ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్నడు. ఫస్ట్ టైం కానీ తన సినిమాకి స్టోరీ రాసుకొని హిట్ అందుకోవడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో తన తర్వాత సినిమా తనకి సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయడానికి నాగశౌర్య రెడీ అయ్యారు. ఇదిలా ఉండగా ఈ సినిమా మధ్యలో ఆగిపోయింది అని మొన్నటిదాకా వార్తలు వచ్చాయి.  బడ్జెట్ విషయంలో సరిగ్గా కుదరక సినిమా మధ్యలోనే ఆగిపోయినట్లు ఇండస్ట్రీలో పుకార్లు గట్టిగానే వినబడ్డాయి.

 

కానీ వచ్చిన వార్తలు అవాస్తవమని దాదాపు సినిమాకి సంబంధించి 50 శాతం షూటింగ్ పూర్తయిందని మిగతా సినిమా షూటింగ్ అమెరికాలో చేయాల్సి ఉందని ప్రకటించారు. సినిమాకి సంబంధించి మెయిన్ సన్నివేశాలు అన్ని అమెరికాలో చిత్రీకరించాలని అవసరాల శ్రీనివాస్ మొదటిలో డిసైడ్ అయ్యారట. అయితే ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం అమెరికాలో గట్టిగా ఉండటంతో హీరో నాగ శౌర్య కి మరియు డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ కి చాలా టెన్షన్ పట్టుకుంది.

 

ఈ నేపథ్యంలో అమెరికా సన్నివేశాలు అన్ని ఇండియా లో తీసే విధంగా స్టోరీ మార్చాలని నిర్మాతలు అవసరాల శ్రీనివాస్ నీ కోరారట. దానికి డైరెక్టర్ ససేమిరా అన్నారు అని ఫిలిం నగర్ టాక్. కచ్చితంగా సన్నివేశాలు అమెరికాలో తీస్తేనే బాగుంటుందని సగం షూటింగ్ పూర్తి అయిపోవడంతో మార్చడం అంత తేలిక కాదని తేల్చిచెప్పేశాడట. దీంతో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో, కరోనా వైరస్ అమెరికాలో నుండి ఎప్పుడు పోతుందో అన్న టెన్షన్ తో హీరో నాగశౌర్య ఉన్నారట.   

మరింత సమాచారం తెలుసుకోండి: