టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సినిమా ముందు అనేక ప్లాపులు చూడటం జరిగింది. ఆ టైంలో రామ్ ఇండస్ట్రీలో దుకాణం సర్దడం గ్యారెంటీ అని అందరూ భావించారు. అయితే ఎప్పుడైతే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా చేయడం జరిగిందో ఒక్కసారిగా తన తలరాత మార్చుకున్నాడు రామ్. గత ఏడాది జూలై 18 వ తారీఖున రిలీజ్ అయిన ఈ సినిమా రామ్ కెరీర్లోనే కాకుండా పూరి జగన్నాథ్ కెరీర్ లో కూడా భారీ కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. అంతే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించడం జరిగింది. మాస్ కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో బిసి సెంటర్లలో దుమ్ము దులిపింది.

 

ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రామ్ చేస్తున్న 'రెడ్' గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. 'రెడ్' సినిమా బిగ్ స్క్రీన్ లో రాదని...డిజిటల్ స్ట్రీమింగ్ లో విడుదల కాబోతున్న ట్లు ప్రచారం ఇటీవల ఫిలింనగర్లో అదేవిధంగా సోషల్ మీడియాలో జరుగుతోంది. దీంతో వెంటనే రామ్ పోతినేని సోషల్ మీడియాలో స్పందించాడు. 'నా ఫ్యాన్స్ అందరూ 'రెడ్' సినిమాను బిగ్ స్క్రీన్ లో చూడాలని ఎదురుచూస్తున్నానంటూ' అంత క్లారిటీ ఇచ్చాడు.

 

ఇదే టైములో చిత్ర యూనిట్ కూడా స్పందించింది. కావాలని సరికొత్త రాజకీయాలు చేయాలని ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఉన్న కొంతమంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు తప్పుడు ప్రచారం సినిమాలపై చేస్తున్నారని మండిపడుతున్నారు. ఖచ్చితంగా 'రెడ్' సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుందని మళ్లీ బిసి సెంటర్లలో ఈ సినిమా రికార్డులు సృష్టించడం గ్యారెంటీ అని ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తెలిపింది. మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న 'రెడ్' టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించడం గ్యారెంటీ అని అంటున్నారు. ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సిన ‘రెడ్’ సినిమా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. త్వరలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తి వేయబోతున్న నేపథ్యంలో ఇలాంటి వార్తలను కొట్టి పారేస్తున్నారు సినిమా యూనిట్.

మరింత సమాచారం తెలుసుకోండి: