టాలీవుడ్ లో రమ్యకృష్ణ కు ఉన్న డిమాండ్ గురించి అందరికి తెలిసిందే. రమ్యకృష్ణ చేసే పాత్రల మీద ఒక ప్రత్యేకమైన ఆసక్తి కూడా ఉంటుంది ఈ మధ్య కాలంలో. దానికి కారణం ఆమెకు ఉన్న క్రేజ్. బాహుబలి సినిమాలో శివగామి అనే పాత్ర ఆమె చేయకపోయి ఉంటే సినిమా ముందుకి నడిచి ఉండేది కాదు అంటారు కొందరు. ఆ విధంగా ఆమె ఆ సినిమా మీద తన ప్రభావం చూపించింది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాల గురించి పక్కన పెడితే... ఆమె ఇప్పుడు కొన్ని కీలక పాత్రల మీద ద్రుస్టి పెట్టింది. 

 

రమ్య ఎలాంటి పాత్ర చేసినా సరే ప్రేక్షకులు ఆదరించే పరిస్థితి ఉంటుంది. ఆమెకు ఉన్న క్రేజ్ ఆ విధంగా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆమె బాలీవుడ్ లో టాలీవుడ్ లో విలన్ పాత్రలను చెయ్యాలని చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సినిమా పెద్దది అయితే విలన్ పాత్రలు చేయడానికి ఆమె ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంది అంటున్నారు టాలీవుడ్ జనం. చిరంజీవి సినిమాలో ఆమె విలన్ గా నటిస్తుంది అనే వాళ్ళు ఉన్నారు. అలాగే ఒక యువ హీరో కి కూడా ఆమె విలన్ గా చేస్తుంది అనేది కొందరి మాట. మహేష్ బాబు తర్వాతి సినిమాలో ఆమె లేడీ విలన్ అని అంటున్నారు. 

 

ప్రస్తుతం రమ్యకృష్ణ తమిళం లో ఎక్కువగా సినిమాలు చేస్తుంది. తెలుగులో ఏదైనా ఆఫర్ ఉంటే వస్తుంది గాని తనకు తాను ఏ సినిమాను అడిగే పరిస్థితి ఇప్పుడు లేదు అనే చెప్పాలి. బాలకృష్ణ సినిమా లో కూడా ఆమె విలన్ గా నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అనేది స్పష్టంగా తెలియదు. రమ్యకృష్ణ పారితోషికం కూడా తక్కువగానే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: