టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్. యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తుండగా నివేత థామస్, అంజలి, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ లాయర్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు మగువ మగువ అనే సాంగ్ ఇటీవల రిలీజ్ అయి ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల నుండి కూడా మంచి స్పందనను రాబట్టడం జరిగింది. 

 

ఇటీవల బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ హీరోగా తెరకెక్కి మంచి హిట్ అందుకున్న పిక్ సినిమాకు అధికారిక తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని మన తెలుగు నేటివిటీ కి తగ్గట్లుగా పలు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వాస్తవానికి మే నెల మొదటి వారంలో రిలీజ్ కావలసి ఉంది. అయితే ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో దేశం మొత్తం కూడా మే 3 వరకు లాక్ డౌన్ ప్రకటించడంతో సినిమాల షూటింగ్ అన్ని బంద్ అయ్యాయి. అలానే ఈ సినిమా షూటింగ్ ని కూడా నిలుపుదల చేసిన యూనిట్, ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోందట. 

 

అయితే లాక్ డౌన్ పూర్తి అయినప్పటికీ, మరోవైపు పవన్ కళ్యణ్, క్రిష్ జాగర్లమూడి సినిమాకు డేట్స్ కేటాయించారని, ముందుగా కొద్దిరోజులు ఆ సినిమా షూటింగ్ లో పాల్గొన్న అనంతరమే వకీల్ సాబ్ షూట్ లో జాయిన్ అవుతారని అంటున్నారు. అయితే ఇందులో వాస్తవం ఎంతవరకు ఉందో తెలియదు గాని, ఇప్పటికే వకీల్ సాబ్ ని మరొక రెండునెలల పాటు వాయిదా వేద్దాం అని భావిస్తున్న దిల్ రాజుకు, ఇదే కనుక జరిగితే సినిమాని దసరా వరకు రిలీజ్ చేసే పరిస్థితి ఉండదని అంటున్నారు..... !! 

మరింత సమాచారం తెలుసుకోండి: