పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలను పక్కన పెట్టి సినిమాల మీద దృష్టి పెట్టారు. వరుసగా సినిమాలు చేస్తూ ఆయన ఇప్పుడు కాస్త బిజీ గా ఉన్నారు. అగ్ర దర్శకుల తో కాకపోయినా తన తో గతంలో సినిమాలు చెయ్యాలి అనుకున్న వాళ్ళతో ఆయన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన మూడు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ అనే సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తారు. 

 

సినిమా ఇప్పటికే ప్రారంభం అయినా సరే వాయిదా పడింది కరోనా కారణంగా. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఇక ఇది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ తో రాజమౌళి 2012 లో ఒక సినిమా చెయ్యాలి అని చూసినట్టు సమాచారం. అప్పుడు ఒక కథ కూడా చేసుకుని రెడీ గా ఉన్నారని కాని ఆ సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ ముందుకు రాలేదు అని సమాచారం. పవన్ కళ్యాణ్ ఆ సినిమాను ఒప్పుకున్నట్టే ఒప్పుకుని ఆ తర్వాత వెనక్కు తగ్గినట్టు తెలుస్తుంది. ఆ తర్వాతే రాజమౌళి సునీల్ తో సినిమా చేసారని సమాచారం. 

 

పవన్ కళ్యాణ్ వెనక్కు తగ్గడానికి ప్రధాన కారణం అల్లు అరవింద్ అని తెలుస్తుంది. దీనికి కారణ౦ ఏంటీ అనేది తెలియకపోయిన ఆయన ఆ సినిమా చేయడం అసలు అల్లు అరవింద్ కి ఇష్టం లేదని అందుకే ఆ సినిమాను వద్దని అన్నారని అందుకే పవన్ కళ్యాణ్ వెనక్కు తగ్గారని టాలీవుడ్ లో చర్చలు కూడా జరిగాయి. ఆ తర్వాత మెగా ఫ్యామిలీ అంటే నే రాజమౌళి కి అసలు నచ్చలేదని వాళ్ళతో సినిమాలు అసలు వద్దని భావించారని సమాచారం. ఇప్పుడు రామ్ చరణ్ తో చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: