టాలీవుడ్ లో ఇప్పుడు యాంకర్ల హవా ఎక్కువగా నడుస్తుంది అనేది వాస్తవం. యాంకర్లు ఎక్కువగా సినిమాలు చెయ్యాలి అని చూస్తున్నారు. ఇక సినిమా వార్తల్లో కూడా వాళ్లకు ప్రాధాన్య త ఎక్కువగానే ఉంటుంది ఈ మధ్య కాలంలో. యాంకర్ లు ఎక్కువగా సినిమాల మీద దృష్టి పెట్టడం తో దర్శక నిర్మాతలు కూడా వాళ్ళతో ఉన్న అవసరాలను దృష్టి లో పెట్టుకుని సినిమాలను చెయ్యాలి అని చూస్తున్నారు. వాళ్లకు మంచి క్రేజ్ ఉంటుంది ఫాన్స్ లో. ఇక సినిమా బుల్లి తెర మీద బాగా ప్రమోట్ చేసే సత్తా కూడా వాళ్లకు ఉంది. 

 

అందుకే ఇప్పుడు వాళ్ళను అన్ని విధాలుగా వాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దర్శక నిర్మాతలు ఎక్కువగా వాళ్లకు అవకాశాలు ఇస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో అనసూయ ఎక్కువగా సినిమాలను చెయ్యాలి అని ప్రయత్నాలు చేస్తుంది. ఆమెకు మంచి పాత్రలు ఇవ్వాలని దర్శకులు కూడా భావిస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఇక ఆమెకు ఇప్పుడు రెండు మూడు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అవి అన్నీ కూడా పెద్ద హీరోల సినిమాలే. ప్రస్తుతం ఆమె వాటికి భారీగా డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. 

 

కథ బాగుంది అనుకుంటే తన నటనకు అందులో ప్రాధాన్యత ఉందీ అనుకుంటే మాత్రం ఆమె సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తుంది. అందులో భాగంగానే ఆమె ఎక్కువగా డిమాండ్ చేయడం మొదలు పెట్టింది అంటున్నారు టాలీవుడ్ జనాలు. కోటి రూపాయల వరకు ఆమె డిమాండ్ చేసిందని టాక్. విలన్ పాత్ర కు ఈ మొత్తాన్ని కావాలని ఆమె అడిగినట్టు సమాచారం. దీనితో దర్శకుడు నిర్మాత భయపడి ఆమెను పక్కన పెట్టారని టాక్. ప్రస్తుతం ఆమె నితిన్ సినిమాలో చేస్తుంది. ఈ సినిమా తర్వాత మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులోనే ఆమె భారీగా డిమాండ్ చేసినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: