ప్రస్తుతం ప్రపంచదేశాలను కరోనా వైరస్(కోవిడ్-19) అతలా కుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా దెబ్బకు ప్రపంచదేశాల ప్రజలు అబ్బా అంటున్నారు. ఇక ఇప్పటికే కరోనా వైరస్ సోకి ప్రపంచవ్యాప్తంగా 154,320 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరియు బాధితుల సంఖ్య 22.50 లక్షలు దాటిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా అమెరికాలో కరోనా మహమ్మారి కనీవినీ ఎరుగని రీతిలో కల్లోలం సృష్టిస్తోంది. అందుకే ఇది చైనా వైరస్ అంటూ ఆమెరికా చైనాపై విరుచుకుపడుతోంది. మిగతా దేశాలు కూడా చైనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తుతన్నారు.
మరోవైపు వ్యాక్సిన్ లేని కరోనా వైరస్ నియంత్రించేందుకు పలు దేశాలు లాక్డౌన్ విధించాయి. ఇందుకు భారత్ కూడా మినహాయింపు కాదు. భారత్లో సైతం కరోనా విజృంభిస్తుండడంతో కేంద్రం ఇక్కడ లాక్డౌన్ విధించింది. దీంతో లాక్డౌన్ నేపథ్యంలో దేశంమొత్తం ఇళ్లకే పరిమితమైంది. ఈ క్రమంలోనే కొందరికి తినేందుకు తిండిలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరోవైపు షూటింగ్స్ లేక సెలబ్రెటీలు సైతం ఇంటికే పరిమితం అయ్యారు. ఈ క్రమంలోనే ఎవరి నచ్చినట్టు వాళ్లకు ఉంటున్నారు.
అయితే ముఖ్యంగా హీరోయిన్లు, యాంకర్లు తమ అందచందాలతో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నారు. అందులో యాంకర్ శ్రీముఖి కూడా ఒకటి. కెరీర్ స్టాటింగ్లో చాలా పద్దతిగా కనిపించింది ఈ భామ. జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లిగా నటించిన శ్రీముఖి.. ఆ తర్వాత చిన్న చిన్న ప్రోగ్రామ్స్తో యాంకర్గా మొదలుపెట్టింది. ఆ తర్వాత యాక్టర్గా మారింది.. ఇక ఇప్పుడు స్టార్ యాంకర్గా చక్రం తిప్పుతూ.. హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుతంది.
ఇక ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఇంట్లో ఉంటున్న ఈ బ్యూటి చీరందాలతో చమటలు పట్టించింది. నిమ్మ పండు రంగు చీరలో అద్దం ముందు తీసుకున్న సెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ బ్యూటి. ఈ ఫోటోలను చూసి అదిరిందంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఆ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి.