ప్రస్తుతం కరోనా వ్యాధి భయంతో ఇతర దేశాలతో పాటు మన దేశం కూడా రాబోయే మే నెల 3వ తేదీ వరకు లాక్ డౌన్ చేయబడి ఉండడంతో ఎక్కడి ప్రజలు అక్కడే పూర్తిగా తమ ఇళ్లకే పరిమితం అయి ఉండడం జరిగింది. ప్రజల మధ్య సామజిక దూరం పెరిగితేనే ఈ మహమ్మారి నుండి మనం త్వరగా రక్షించబడతాం అని భావించి అన్ని దేశాలు కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇక దీనితో అన్ని రంగాలతో ఆటు సినిమా రంగం కూడా మూతబడి, ఎక్కడి నటులు అక్కడే తమ ఇళ్లలో ఉండిపోయారు. 

 

అందరూ ఇళ్లలోనే ఉండడంతో కొందరు తమకు సంబంధించి వ్యక్తిగతంగా రకరకాల ఫోటోలు, వీడియో లు పోస్ట్ చేస్తుంటే మరికొందరు మాత్రం ఈ కరోనా వలన తమ ఫ్యామిలీల తో హాయిగా గడపడంతో పాటు తమ ఇంట్లోని వారికి ఎంతో కొంత సాయపడే అవకాశం వచ్చిందని అంటున్నారు. ఇక ఇటీవల ఆ విధంగా తన ఇంటిని శుభ్రం చేస్తూ తమ ఫ్యామిలీకి సాయపడుతున్న వీడియో ని అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తన సోషల్ మీడియా ఛానల్ లో పోస్ట్ చేస్తూ, నేను 'బి ద రియల్ మ్యాన్' అని అనిపించుకునేందుకు నా ఇంటి పనులు చేస్తున్నాను, అంటూ తదుపరి ఇదే ఛాలెంజ్ ని దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళికి విసరడం జరిగింది. 

 

అయితే సందీప్ రెడ్డి ఛాలెంజ్ ని సాదరంగా స్వీకరించిన రాజమౌళి, నేడు కాసేపటి క్రితం తన ఇంటి పనులన్నీ చేస్తూ దానిని పూర్తి చేసిన రాజమౌళి, తదుపరి అదే ఛాలెంజ్ ని తన ఆర్ఆర్ఆర్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పాటు నిర్మాత శోభు, దర్శకుడు సుకుమార్, అలానే తన సోదరుడు ఎమ్ ఎమ్ కీరవాణికి విసరడం జరిగింది. ఇకపోతే కొద్దిసేపటి క్రితం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, మీ ఛాలెంజ్ ని నేను సాదరంగా వీకరిస్తున్నాను జక్కన్న అంటూ ఒక పోస్ట్ పెట్టారు. మరి మిగతా వారు రాజమౌళి ఛాలెంజ్ ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో చూడాలని పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: