తెలుగు బుల్లితెరపై నవ్వుల వర్షం కురిపిస్తూ మంచి ఆదరణతో ముందుకు సాగుతుంది జబర్ధస్త్ కామెడీ షో.  ఏడేళ్ల క్రితం మొదలైన ఈ కామెడీ షో ఇప్పటికీ కొనసాగుతుంది.  జబర్ధస్త్ షోకి మొదట యాంకర్ గా వచ్చిన అనసూయ కొద్ది రోజుల్లోనే పాపులారిటీ సంపాదించింది. దాంతో ఆమె సినీ రంగంలోకి అడుగు పెట్టడం.. ఆమె స్థానంలో రష్మీ గౌతమ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.  జబర్ధస్త్ రేటింగ్స్ బాగా పెరిగిపోవడంతో జబర్ధస్త్, ఎక్స్ ట్రా జబర్ధస్త్ కార్యక్రమాలు మొదలయ్యాయి. జబర్ధస్త్ తో ఎంతో మంది కళాకారులు మంచి పొజీషన్లోకి వచ్చారు. కొంత మంది సినీ రంగంలో తమ సత్తా చాటుతున్నారు.  యాంకర్లు గా ఉన్న అనసూయ, రష్మిలు వెండి తెరపై తమ సత్తా చాటుతున్నారు.

 

 జబర్ధస్త్ కామెడీ షో తో పరిచయం అయిన ధన్ రాజ్, వేణు, తాగుబోతు రమేష్, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ ఇలా ఎంతో మంది వెండి తెరపై తమదైన కామెడీ పండిస్తున్నారు.. వారిలో జబర్ధస్త్ సత్య ఒకరు.  ధన్ రాజ్ టీమ్ లో ఉన్న సత్య ‘స్వామిరారా’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  సినిమాల్లో అవకాశాలు అంతంత మాత్రంగా వున్న సమయంలో 'జబర్దస్త్' చేయడం మొదలుపెట్టాను. ధన్ రాజ్ టీమ్ లో స్కిట్స్ చేస్తూ మంచి పేరు సంపాదించాడు. జబర్ధస్త్ లో నాకు మంచి గుర్తింపు రాగానే వెండితెరపై చాన్సుల కోసం ప్రయత్నించా అన్నారు.

 

అప్పట్లో జబర్ధస్త్ లో మంచి రెమ్యూనరేషన్ ఉండేది.. అయినా దాన్ని వదిలి సినిమాల్లో ట్రై చేయడం అనేది సాహసమే అయినా అదృష్టం కొద్ది వరుసగా సినిమా ఛాన్సులు వచ్చాయి. అలా వచ్చిన పాత్రలు నన్ను నేను నిరూపించుకునేవి .. నిలదొక్కుకునేవి కావడం మరో అదృష్టం. గత ఏడాది హరీష్ శంకర్ దర్శకత్వలో వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్ మూవీలో నాకు మంచి పాత్ర లభించడం నా అదృష్టం.  ప్రస్తుతం 'రెడ్' , 'సోలో బ్రతుకే సో బెటర్' .. 'శ్రీకారం' సినిమాల్లో నటించానని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: