గ్లామర్ ఫీల్డ్ అయిన సినిమా రంగంలో ప్రేమలు, పెళ్లిళ్లు అనేవి ఎక్కువుగా ఆకర్షణలు, అవసరాలు.. డబ్బు, వ్యామోహం, అవకాశాల నేపథ్యంలో నడుస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రేమించుకవడం.. డేటింగ్లు చేసుకోవడం.. ఒకరిని మరొకరు వాడుకోవడం... ఒక వేళ పెళ్లి చేసుకున్నా పర వ్యామోహంలో పడి అంతే సులువుగా వదిలేయడం చకచకా జరుగుతూ ఉంటాయి. అయితే కొందరు మాత్రం చిన్న చిన్న కారణాలు... ఇతరత్రా కారణాలతో రెండో పెళ్లి చేసుకుంటారు. అయితే వీరికి భిన్నంగా మన కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు రెండో పెళ్లి చేసుకున్నాడు.
టాలీవుడ్లో దశాబ్దాలుగా తిరుగులేని డైనమిక్ హీరోగా ఉన్నారు కలెక్షన్ కింగ్ మోహన్బాబు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలానికి చెందిన ఆయన కెరీర్ ఆరంభంలో సినిమా రంగంలో అవకాశాల కోసం మద్రాస్ వెళ్లారు. ఈ క్రమంలోనే మోహన్బాబుకు కెరీర్ స్టార్టింగ్లోనే ఓ అమ్మాయితో పెళ్లవ్వడం.. ఈ దంపతులకు మంచు విష్ణు, మంచు లక్ష్మీ ప్రసన్న పుట్టడం జరిగాయి. అయితే ఆమె చనిపోవడంతో మోహన్ బాబు త న పిల్లలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో తన భార్య సోదరి అయిన తన మరదలు నిర్మల కుమారి ( ప్రస్తుత భార్య ) నే రెండో పెళ్లి చేసుకున్నాడు.
మోహన్ బాబు - నిర్మల దంపతులకు మనోజ్ పుట్టాడు. అలా మోహన్ బాబుకు మొత్తం ముగ్గురు పిల్లలు. నిర్మల కుమారి తన అక్క పిల్లలు అయిన విష్ణు, లక్ష్మీ ప్రసన్న లను తన పిల్లలు లాగానే పెంచారు. ఆమె మనస్సు వెన్నే అని చెప్పాలి. తర్వాత మోహన్ బాబు విలన్ నుంచి హీరోగా ఎదిగి.. ఆ తర్వాత తిరుగులేని నిర్మాతగా కూడా మారారు. ఇక ఇప్పుడు సినిమా రంగంలో స్థిరపడ్డారు.
మంచు విష్ణు, మంచు మనోజ్ ఇద్దరు హీరోలుగా ఉన్నారు. అటు మంచు లక్ష్మీ ప్రసన్న సైతం అటు సినిమా రంగంలోనూ ఇటు టెలివిజన్ రంగంలోనూ స్థిరపడి మంచి మార్కులు తెచ్చుకున్నారు. అది మంచు మోహన్ బాబు రెండో వైవాహిక జీవితం అలా ప్రశాంతంగా సాగిపోతోంది.