బాలయ్య బోయపాటి కాంబినేషన్ అంటే జనాల్లో ఎక్కడలేని ఆసక్తి మొదలవుతుంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు ఎంతటి బ్లాక్ బస్టర్ సాధించాయో అందరికీ తెలిసిందే. సింహా సమయానికి బాలయ్య వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. అలాంటి టైమ్ లో వచ్చిన సింహా అభిమానుల ఆకలి తీర్చింది. దాని తర్వాత లెజెండ్ మరింతగా నచ్చేసింది.

 

 

అయితే ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం స్క్రిప్టు పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్ర లాక్డౌన్ అనంతరం చిత్రీకరణ మొదలు పెట్టనుంది. అయితే బోయపాటితో బాలయ్య సినిమా అన్నప్పటి నుండి రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. సినిమా కథపై అనేక పుకార్లు వచ్చాయి. అయితే వీటన్నింటిపై బోయపాటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

 

 


ముందుగా అందరూ అనుకుంటున్నట్టు ఈ సినిమా పొలిటికల్ డ్రామా కాదట. ఇదొక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెప్తున్నాడు. ఇందులో బాలక్రిష్ణ ఫ్యామిలీ మ్యాన్ లా కనిపించనున్నాడట. అయితే అఘోరా పాత్ర ఉంటుందా అని అడిగితే చాలా తెలివిగా సమాధానం ఇచ్చాడు. వారణాసిలో ఒకానొక ఎపిసోడ్ లో బాలయ్య లుక్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుందని చెప్పాడు. కానీ అది అఘోరా పాత్ర అవునా కాదా అన్నది మాత్రం చెప్పలేదు.

 

 

అయితే వారణాసి నేపథ్యం అనగానే బాలయ్య అఘోరా గా కనిపిస్తాడన్న వాదనకి మరింత బల చేకూరింది. అందుకోసమే బాలయ్య గుండు కొట్టించుకున్నారని అనుకుంటున్నారు. ఇక హీరోయిన్ల విషయమై ఈ విధంగా స్పందించాడు. ఇప్పటి వరకు ఇద్దరి పేర్లని సెలెక్ట్ చేశాడట. ఆ ఇద్దరిలో ఎవరిని తీసుకోవాలనే నిర్ణయాన్ని లాక్డౌన్ పూర్తయ్యాక ప్రకటిస్తామని చెప్పుకొచ్చాడు. మరి బాలయ్య సరసన నటించే ఆ హీరోయిన్ ఎవరో..ఆ ఇద్దరిలో అవకాశం ఎవరికి దక్కనుందో..

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: