దర్శకధీరుడు రాజమౌళి కమిట్ మెంట్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. జక్కన్న ఆ ఒక్క స్టార్ ను తప్ప టీటౌన్ లో అందరిని కవర్ చేసినట్టే.. లేటెస్ట్ గా ఈ టాప్ డైరెక్టర్ మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నట్టు రివీల్ చేశాడు. అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ రాజమౌళి తమను మోసం చేశాడని ఫీలవుతున్నారు. 

 

ఒక్కో సినిమాతో రాజమౌళి ఒక్కో మెట్టు ఎక్కి ఇప్పుడు ఇండియన్ టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. అయినప్పటికీ జక్కన్న మాత్రం తెలుగు స్టార్స్ తో మాత్రమే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. తెలుగు హీరోలతోనే వరల్డ్ రికార్డ్స్ బద్దలు కొట్టాలని.. టాలీవుడ్ కీర్తిని ప్రపంచవ్యాప్తం చేయాలని జక్కన్న ఫిక్స్ అయ్యాడు. ప్రస్తుతం రాజమౌలి రామ్ చణ్, ఎన్టీఆర్ లతో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మహేశ్ బాబుతో సినిమా ఉంటుందని రివీల్ చేసి సర్ ప్రైజ్ షాక్ ఇచ్చాడు. జక్కన్న నిర్ణయంతో ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ హర్ట్ అయినట్టు టాక్.  

 

ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌలి మరోసారి ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందని ఆశపడ్డారు. అదే విధంగా ప్రభాస్ ఫ్యాన్స్ సైతం జక్కన్న డార్లింగ్ తోనే తర్వాతి మూవీ చేస్తాడని ఎక్స్ పెక్ట్ చేశారు. ఇదే క్రమంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా దర్శకధీరుడు తమ హీరోతో సినిమా చేయలేదు కాబట్టి ఈ సారి సినిమా చేసే ఛాన్స్ ఉందని ఆశపెట్టుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాజమౌళి, మహేశ్ బాబుతో సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. ఇక అల్లు అర్జున్, పవర్ స్టార్ తో సినిమా చేస్తే రాజమౌళి టాలీవుడ్ లో అందరి టాప్ స్టార్స్ తో సినిమా చేసినట్టే. 

 

కరోనా ఎఫెక్ట్ టైమ్ లో రాజమౌళి మీడియాకు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వూలో ఆసక్తికర విషయాలతో ఆశ్చర్యపరిచాడు. అంతేకాదు జక్కన్న కమిట్ మెంట్ కు హ్యాట్సాఫ్ అంటున్నారు. అప్పుడెప్పుడో దానయ్యకు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలో కెఎల్ నారాయణకు ఇచ్చిన మాట ప్రకారం తర్వాత ఆయన నిర్మాణంలోనే మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్నాడట.ప్రస్తుతం రాజమౌళి తలచుకుంటే బాలీవుడ్ నిర్మాతలు కూడా క్యూ కడతారు. కానీ జక్కన్న మాత్రం ఇచ్చిన మాట ప్రకారం ఒకరి తర్వాత ఒకరితో సినిమా చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: