ముందుగా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు అన్న ఎన్టీఆర్ గారు హీరోగా తెరకెక్కిన దైవబలం సినిమాలో ఒక చిన్న పాత్ర చేయడం ద్వారా వెండితెరపై కనిపించరు నటభూషణ్ శోభన్ బాబు. ఇక ఆ తరువాత నుండి మెల్లగా అక్కడక్కడా సినిమాల్లో కొన్ని ముఖ్య పాత్రల్లో నటించిన శోభన్ బాబు, ఆపై హీరోగా మారి మంచి మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగారు. తన కెరీర్ లో ఎక్కువగా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేసి ఆంధ్ర అందగాడిగా ఎందరో లేడీ ఫ్యాన్స్ ని సంపాదించిన శోభన్ బాబు, ఎక్కువగా అప్పట్లో మంచి బిజినెస్ మ్యాన్ అనే గొప్ప పేరు కూడా గడించారు. 

 

వాస్తవానికి అప్పట్లో ఎక్కువమంది నటీనటులు తమకు వస్తున్న డబ్బుని తిరిగి సినిమాల్లోనే ఏదో ఒక రూపంలో పెట్టుబడిగా పెట్టడం జరుగగా, ఆ విధమైన ఆలోచన తనకు పెద్దగా ఆసక్తి లేదని భావించిన శోభన్ బాబు, తన సంపాదనను ఎప్పటికైనా మెల్లగా మంచి ధరను పెంచుకుంటూ పోయే భూమిపై పెట్టడం మొదలెట్టారట. ఆ విధంగా మెల్లగా తన ఆదాయాన్ని పలు స్థలాలను కొనుగోలు చేయడం పై పెట్టిన శోభన్ బాబు, అనంతరం కొద్దికొద్దిగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మంచి పేరు గడించడం జరిగింది. భూమి అనేది ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుందని, భూమాతను నమ్మిన వారెవ్వరు నష్టపోలేదని, అందుకే తాను భూమిని నమ్మి పెట్టుబడి పెడితే, ఆ మాత చలువ వలన మెల్లగా తనకు మంచి లాభాలు లభించాయని గతంలో శోభన్ బాబు పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. 

 

ఆ తరువాత తనవంటి తోటి ఇతర నటీనటులైన మురళి మోహన్ తదితరులకు ఈ బిజినెస్ పై కొంత సలహాలిచ్చిన శోభన్ బాబు, రాను రాను మరింత మంచి పేరు, గొప్ప సంపదను సంపాదిస్తూ ముందుకు సాగారు. ఇక ఇప్పటికీ కూడా తన సంపదకు కారణం అయిన శోభన్ బాబు గురించి ఎంతో గొప్పగా అప్పుడప్పుడూ చెప్తూ ఉంటారు మురళి మోహన్. ఆ విధంగా టాలీవుడ్ లో మంచి స్టార్ హీరోగా ఓ వైవు కొనసాగుతూ, మరోవైపు మంచి బిజినెస్ టైకూన్ గా కూడా గొప్ప పేరు గడించిన ఆంధ్ర అందగాడు శోభన్ బాబు ప్రస్తుతం మన మధ్యన లేనప్పటికీ ప్రేక్షకుల,అభిమానుల గుండెల్లో మాత్రం ఎప్పటికీ నటుడిగా ఆయన నిలిచే ఉంటారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: